Adani group: హిండెన్బర్గ్ ‘షార్ట్’ షూటింగ్.. కొనసాగిన అదానీ షేర్ల పతనం
హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లలో అధికభాగం సోమవారం నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన ఎనర్జీ షేర్లు కుప్పకూలాయి.
ముంబయి: హిండెన్బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) నివేదిక ప్రభావంతో గతవారం భారీ నష్టాలను చవిచూసిన అదానీ గ్రూప్ (Adani group) షేర్లు.. సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ప్రధానమైన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు లాభాలను దక్కించుకున్నప్పటికీ.. అధిక భాగం కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన ఎనర్జీ షేరు ధరలు భారీగా పతనమయ్యాయి.
• ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises) షేరు ధర 3.93శాతం లాభంతో రూ.2,869.85 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్లో ఈ షేరు ధర ఒక దశలో 10 శాతం వరకు పెరిగింది.
• ట్రేడింగ్ ఆరంభమైన కాసేపటికే అదానీ టోటల్ గ్యాస్ (Adani Total Gas) షేరు ధర 20శాతం పతనమై లోయర్ సర్క్యూట్ను తాకింది. నేటి ట్రేడింగ్లో ఈ కంపెనీ షేరు విలువ రూ.585.60 తగ్గి రూ.2,342.40 వద్ద ముగిసింది.
• అదానీ ట్రాన్స్మిషన్ (Adani Transmission) షేరు ధర కూడా ఒక దశలో 20 శాతం కుంగింది. ఆ తర్వాత కాస్త కోలుకుని మార్కెట్ ముగిసే సమయానికి 15.23శాతం నష్టంతో రూ.1707.35 వద్ద స్థిరపడింది.
• అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) షేరు విలువ 20శాతం పతనమైంది. నేటి ట్రేడింగ్లో ఈ షేరు ధర రూ.297.25శాతం తగ్గి రూ.1,189.00 వద్ద ముగిసింది.
• అదానీ పవర్ (Adani Power) లిమిటెడ్ షేరు ధర 5 శాతం కుంగి రూ.235.55గా ముగిసింది.
• అదానీ విల్మర్ (Adani Wilmar) షేరు ధర కూడా 5 శాతం తగ్గి రూ.491 వద్ద స్థిరపడింది.
• అదానీ పోర్ట్స్ (Adani Ports) షేరు ధర 0.64శాతం స్వల్ప లాభంతో రూ.600.80 వద్ద ముగిసింది. ఈ షేరు కూడా నేడు ఒక దశలో 10 శాతానికి పైగా లాభంతో ట్రేడ్ అయ్యింది.
• ఇక, అంబుజా సిమెంట్స్, ఏసీసీ షేర్లు కూడా ఒకశాతానికి పైగా లాభపడ్డాయి.
అదానీ గ్రూప్ (Adani Group) తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ (Hindenburg research) విడుదల చేసిన సంచలన నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో స్టాక్మార్కెట్లలో ఈ షేర్లు తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!