Gautam Adani: 2028వరకు కీలక వ్యాపారాల విభజన: అదానీ గ్రూప్
Gautam Adani: అదానీ గ్రూప్ ఆధ్వర్యంలోని కీలక వ్యాపారాలు ఇప్పటికీ ఆ గ్రూప్ ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ కిందే ఉన్నాయి. వాటి విభజనను 2028 వరకు పూర్తిచేస్తామని అదానీ గ్రూప్ వెల్లడించింది.
దిల్లీ: భారత కుబేరుడు గౌతమ్ అదానీ (Gautam Adani) నేతృత్వంలోని అదానీ గ్రూప్ (Adani Group) నిర్వహణలో అనేక వ్యాపారాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ కొన్ని ప్రధాన సంస్థ అయిన ‘అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (AEL)’ కిందే కొనసాగుతున్నాయి. వాటిలో హైడ్రోజన్, విమానాశ్రయాలు, డేటా సెంటర్ల వ్యాపారాలు ప్రధానమైనవి. వీటిని 2025- 2028 మధ్య ప్రత్యేక సంస్థలుగా ఏర్పాటు చేస్తామని ‘చీఫ్ ఫైనాన్షియల్ అధికారి (CFO)’ జుగేషిందర్ సింగ్ తెలిపారు.
అదానీ ఎంటర్ప్రైజెస్ (AEL) రూ.20,000 కోట్ల మలివిడత పబ్లిక్ ఆఫర్ (FPO) కోసం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇటీవలే దరఖాస్తు సమర్పించింది. ఎఫ్పీఓ (FPO)ను జనవరి 27న ప్రారంభించి జనవరి 31న పూర్తి చేయనున్నారు. ఎఫ్పీఓ (FPO)లో ఒక్కో షేరును రూ.3,112- 3,276 ధరల శ్రేణిలో విక్రయించనున్నారు. ప్రస్తుతం నమోదిత సంస్థలుగా మారిన నౌకాశ్రయాలు, విద్యుత్తు, సిటీ గ్యాస్ వ్యాపారాలు కూడా ఒకప్పుడు ఏఈఎల్ (AEL) కింద ఉన్నవే. హైడ్రోజన్, విమానాశ్రయాల నిర్వహణ, మైనింగ్, డేటా సెంటర్లు, రోడ్లు- లాజిస్టిక్స్ మాత్రం ఇంకా అదానీ ఎంటర్ప్రైజెస్ (AEL) ఆధ్వర్యంలోనే ఉన్నాయి. హైడ్రోజన్ వ్యాపారంలో వచ్చే 10 ఏళ్లలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి అదానీ గ్రూప్ సిద్ధమైన విషయం తెలిసిందే.
కనీస పెట్టుబడుల విలువను చేరుకున్న తర్వాత ఆయా వ్యాపారాలను విభజించి ప్రత్యేక సంస్థలుగా ఏర్పాటు చేస్తామని జుగేషిందర్ తెలిపారు. విభజనకు కావాల్సిన కనీస అనుభవం కూడా ఈ విభాగాలకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ స్థితి 2025- 2028 మధ్య ఈ వ్యాపారాలు అందుకునే అవకాశం ఉందని తెలిపారు. పర్యావరణహితమైన ఉదజని ఇంధనాన్ని అత్యంత చౌక ధరకు అందించాలని అదానీ గ్రూప్ (Adani Group) లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయ సేవల నిర్వహణ సంస్థగా అవతరించాలని ఉవ్విళ్లూరుతోంది.
మరింత మంది రిటైల్ మదుపర్లకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా కంపెనీలో వాటాదారుల సంఖ్యను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఎఫ్పీఓ (FPO)కు వస్తున్నామని జుగేషిందర్ తెలిపారు. రైట్స్ ఇష్యూకి బదులుగా ప్రైమరీ ఆఫర్కు వెళ్లడానికి కూడా అదే కారణమన్నారు. ఈ ఎఫ్పీఓ (FPO)లో సమీకరించిన నిధులతో హరిత ఉదజని, విమానాశ్రయాల్లో వసతులు, కొత్త ఎక్స్ప్రెస్వేల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టనున్నామన్నారు. కొంత భాగాన్ని రుణం తీర్చడానికి వినియోగించనున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప