Adani Group: 2రోజుల్లో ₹82 వేల కోట్లు.. ‘అదానీ’ షేర్లలో అనూహ్య ర్యాలీకి కారణాలేంటి?
Adani Group: అదానీ గ్రూప్ షేర్లు గత రెండు రోజుల్లో రూ.82 వేల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్ను జత చేసుకున్నాయి. స్టాక్స్ ర్యాలీ వెనుక ఉన్న కారణాలేంటో చూద్దాం..!
దిల్లీ: అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల షేర్లలో గత రెండు రోజుల్లో ఉపశమన ర్యాలీ కొనసాగుతోంది. కీలక కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises) షేరు గత రెండు రోజుల్లో 30 శాతం పుంజుకుంది. మంగళవారం 14 శాతానికి పైగా లాభంతో ముగిసిన ఈ షేరు.. ఈరోజు మరో 15 శాతం లాభపడింది. ఇంట్రాడేలో రూ.1,567 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అయినప్పటికీ.. 52 వారాల గరిష్ఠంతో పోలిస్తే మాత్రం ఇంకా 60 శాతం దిగువనే ట్రేడవుతోంది.
అదానీ గ్రూప్ (Adani Group) ఆధ్వర్యంలోని 10 కంపెనీల షేర్లు బుధవారం పాజిటివ్గానే ముగిశాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ విల్మర్ 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ని తాకాయి. జనవరి 25న వెలువడ్డ హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీలు దాదాపు 12 లక్షల మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయాయి. గత రెండు రోజుల ర్యాలీతో మార్కెట్ విలువ మళ్లీ దాదాపు రూ.82,000 కోట్లు పెరగడం విశేషం.
మరి వరుస నష్టాల నుంచి ఈ గ్రూప్ స్టాక్స్ బ్రేక్ తీసుకోవడానికి దోహదం చేసిన అంశాలేంటో చూద్దాం..
- ఒడిశాలోని కుట్రుమాలిలో 128 మిలియన్ టన్నుల బాక్సైట్ బ్లాక్ను కేటాయించే విషయంపై తమకు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ అందినట్లు అదానీ గ్రూప్ (Adani Group) ప్రకటించింది.
- కంపెనీల బ్యాలెన్స్ షీట్, భవిష్యత్తు వృద్ధిపై ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపేందుకు అదానీ గ్రూప్ (Adani Group) సింగపూర్, హాంకాంగ్లలో మూడు రోజుల రోడ్షో నిర్వహించింది. రుణాల చెల్లింపులు, నిధుల సమీకరణపై తమ ప్రణాళికలను వివరించింది.
- మరోవైపు 800 మిలియన్ డాలర్ల తాజా రుణ సదుపాయానికి అదానీ గ్రూప్ (Adani Group)నకు హామీ లభించినట్లు ఎకనామిక్ టైమ్స్ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కథనాన్ని ప్రచురించింది. ఇది కూడా అదానీ గ్రూప్ (Adani Group) స్టాక్స్పై మదుపర్ల సెంటిమెంటును పెంచింది. ఈ నిధులను అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన 750 మిలియన్ డాలర్ల రుణ పునర్వ్యవస్థీకరణకు వినియోగించుకోనున్నట్లు ఇన్వెస్టర్ల రోడ్షోలో వెల్లడించినట్లు సమాచారం.
- ఓ ప్రముఖ సావరీన్ వెల్త్ ఫండ్ నుంచి 3 బిలియన్ డాలర్ల రుణ మంజూరుకు హామీ లభించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసినట్లు రాయిటార్స్ పేర్కొంది. ఈ విషయాలనే అదానీ గ్రూప్ (Adani Group) మూడు రోజుల రోడ్షోలో ఇన్వెస్టర్లకు వివరించినట్లు తెలుస్తోంది. అయితే, ఏ సావరీన్ ఫండ్ నుంచి రుణం లభించనుందనే విషయం మాత్రం తెలియరాలేదు. దీనిపై ఇంకా అదానీ గ్రూప్ (Adani Group) నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
- అదానీ గ్రూప్ (Adani Group)నకు రుణ సదుపాయం కల్పించిన ఎస్బీఐ సహా ఇతర దేశీయ సంస్థలు ఆయా ‘అదానీ’ కంపెనీలకిచ్చిన క్రెడిట్ ఫెసిలిటీస్ను కొనసాగించాలని నిర్ణయించాయి. వార్షిక సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే