Investors Summit: ఏపీలో అదానీ సిమెంట్ ప్లాంట్స్.. అంబానీ సోలార్ ప్రాజెక్ట్
Andhra Pradesh Global Investors Summit: విశాఖ వేదికగా జరుగుతున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో భాగంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అంబానీ, అదానీ ముందుకొచ్చారు. సిమెంట్ ఫ్యాక్టరీలు, డేటా సెంటర్లు, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పనున్నట్లు ప్రకటించారు.
విశాఖపట్నం: ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలైన అంబానీ, అదానీ ముందుకొచ్చారు. ఏపీలో తాము సిమెంట్ ఫ్యాక్టరీలు, డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని అదానీ గ్రూప్ (Adani group) ప్రకటించగా.. సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయనున్నట్లు ముకేశ్ అంబానీ (Mukesh ambani) ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు (Global Investors Summit) ఇందుకు వేదికైంది. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో భాగంగా తొలి రోజు ఈ ప్రకటనలు వెలువడ్డాయి.
ఆంధ్రప్రదేశ్లో రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయనున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సీఈఓ, గౌతమ్ అదానీ తనయుడు కరణ్ అదానీ ప్రకటించారు. 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో కడప, నడికుడిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విశాఖలో 400 MW డేటా సెంటర్ను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 100 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కృష్ణపట్నం, గంగవరం పోర్టులు నిర్వహిస్తున్నామని, రాబోయే ఐదేళ్లలో ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంతో పాటు, ఈ పోర్టులను ఇండస్ట్రియల్ పోర్ట్ సిటీస్గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో అనంతపురం, కడప, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో 15వేల మెగావాట్ల పునరుత్పాదక పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదానీ ఫౌండేషన్ సేవలను ఏపీకి విస్తరించనున్నట్లు తెలిపారు.
10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్
ఏపీలో 10 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. పెట్టుబడిదారుల సదస్సుకు స్వయంగా హాజరైన ఆయన.. ఈ మేరకు దీని గురించి ప్రకటన చేశారు. ఇప్పటికే ఏపీలో కేజీ డి-6 బేసిన్లో రూ.1.50 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు గుర్తుచేశారు. ఇక్కడి బేసిన్లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువు 30 శాతం మేర దేశీయ అవసరాలను తీరుస్తోందని చెప్పారు. భారత అభివృద్ధిలో ఏపీ ఎంత ముఖ్యమో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు. 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా జియో ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా