AI: 30కోట్ల ఉద్యోగాలపై ‘ఏఐ’ ప్రభావం.. గోల్డ్మన్ శాక్స్ అంచనా..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికతలో కనిపిస్తోన్న పురోగతి 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్మన్ శాక్స్ (Goldman Sachs) అంచనా వేసింది. అయితే, సాంకేతికత పురోగతితో కొత్త ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ఉత్పాదకతకు మరింత ఊతమిస్తుందని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధలో (Artificial Intelligence) ఇటీవల కనిపిస్తోన్న పురోగతి ఎన్నో రంగాలపై ప్రభావం చూపనుందనే ఆందోళన ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇవి చాలా రంగాల్లో ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయగలవనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్మన్ శాక్స్ (Goldman Sachs) కూడా తాజా నివేదికలో ఇటువంటి అభిప్రాయాలనే వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతలో వస్తోన్న నూతన ఒరవడులు 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేసింది. ‘ఆర్థికప్రగతిపై కృత్రిమ మేధ ప్రభావాల ముప్పు’ పేరుతో చేసిన పరిశోధనలో గోల్డ్మన్ శాక్స్ ఈ అంశాలు వెల్లడించింది.
పెరగనున్న ఉత్పాదకత..
‘కృత్రిమ మేధ అంచనాలకు అనుగుణంగా తన ఉత్పాదక సామర్థ్యాలను నెరవేరిస్తే కనుక శ్రామిక రంగంలో మాత్రం ఒడిదొడుకులు ఉంటాయి. అమెరికా, యూరప్లలో వృత్తిపరమైన పనుల సమాచారాన్ని విశ్లేషించి చూస్తే అక్కడ ప్రస్తుతమున్న ఉద్యోగాల్లో మూడోవంతు ఆటోమేషన్కు ప్రభావితమవుతాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఎన్నోరకాల పనులకు కృత్రిమ మేధ ప్రత్యామ్నాయంగా మారుతుంది’ అని గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. అయితే, సాంకేతికత పురోగతి అంటేనే కొత్తగా ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ఉత్పాదకతకు మరింత ఊతమని తెలిపింది. తద్వారా ప్రపంచ జీడీపీని 7శాతానికి పెంచేందుకు ఇది దోహదం చేస్తుందని అంచనా వేసింది.
చాట్జీపీటీ (ChatGPT) వంటి అధునాతన కృత్రిమ మేధ వ్యవస్థలు మానవుల మాదిరిగానే కంటెంట్ను సృష్టించగలవని.. వచ్చే దశాబ్దిలో ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం 60శాతం మంది చేస్తున్న పనులు 1940ల్లో అసలు ఉనికిలోనే లేవని తాజా నివేదిక వెల్లడించింది. 1980 తర్వాత సాంకేతికతలో వచ్చిన మార్పుల వల్ల కలిగిన ఉద్యోగాల సృష్టితో పోలిస్తే వాటి స్థానభ్రంశమే వేగంగా జరిగిన విషయాన్ని ప్రస్తావించింది. జనరేటివ్ ఏఐ పురోగతి మునుపటి ఐటీ మాదిరిగా ఉంటే మాత్రం.. రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలను తగ్గించనుందని తాజా నివేదికలో గోల్డ్మన్ శాక్స్ వెల్లడించింది.
ఏయే రంగాల్లో ప్రభావం..
కృత్రిమ మేధతో ఉద్యోగాల ప్రభావం అనేది ఆయా రంగాల్లో వేర్వేరుగా ఉందని తాజా నివేదిక వెల్లడించింది. అత్యధికంగా కార్యనిర్వహణ, న్యాయ రంగాల్లో ఈ ప్రభావం ఉందని తెలిపింది. అడ్మినిస్ట్రేటివ్ రంగంలో 46శాతం, లీగల్ ఉద్యోగాల్లో 44శాతం ముప్పు పొంచివుందని పేర్కొంది. నిర్వహణ, ఇన్స్టాలేషన్, రిపేర్, నిర్మాణ రంగ ఉద్యోగాలకు మాత్రం ఏఐతో తక్కువ ప్రభావం ఉండనుందని చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
Vodafone Idea: డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
NTPC నుంచి 1,600 MW పవర్ ప్లాంట్ ఆర్డర్ను పొందిన BHEL
ప్రముఖ విద్యుత్ సంస్థ NTPC నుంచి 1,600 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ (STPP) స్టేజ్-3 ఏర్పాటుకు ఆర్డర్ను పొందినట్లు BHEL తెలిపింది. -
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
Stock market closing bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 736, నిఫ్టీ 238 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
Realme Narzo 70 Pro: ఎయిర్ గెశ్చర్స్ ఫీచర్తో రియల్మీ నార్జో 70 ప్రో
Realme Narzo 70 Pro 5G: రియల్మీ సంస్థ నార్జో 70 ప్రోను లాంచ్ చేసింది. దీని ధరను రూ.18,999గా నిర్ణయించింది. మార్చి 22 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. -
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
TCS: ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ ఆన్సైట్, ఆఫ్సైట్ ఉద్యోగుల వేతనాలు పెంచనుంది. పనితీరు కనబరిచిన వారికి ఏకంగా 12-15 శాతం పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
Ashwini Vaishnaw: ఈ ఏడాది చివరి నాటికి ‘మేడిన్ ఇండియా’ చిప్ తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2026లోనే బుల్లెట్ రైలు పట్టాలెక్కనున్నట్లు తెలిపారు. -
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
Stock market: దేశీయస్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22వేల స్థాయిని కోల్పోయింది. -
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు గతంలో డ్రగ్స్ వినియోగించినట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. -
‘ఆ వార్తలు అవాస్తవం’: అమెరికా దర్యాప్తు చేపట్టిందన్న కథనంపై అదానీ గ్రూప్ స్పందన
లంచం ఆరోపణల విషయంలో దర్యాప్తు గురించి వెలువడిన మీడియా కథనం అవాస్తవమని అదానీ గ్రూప్(Adani Group) వెల్లడించింది. -
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. -
2024-25లోనూ ఐటీ నియామకాలు అంతంతే
ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి బాట పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందనే అంశమే కాస్త ఊరట కలిగిస్తోంది. -
దీర్ఘకాలంలో చిన్న, మధ్య షేర్లు బలంగానే
చిన్న, మధ్య స్థాయి షేర్ల విలువలు మరీ అధిక స్థాయికి చేరాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేసిన వ్యాఖ్యలతో ఈ షేర్లు గత 3 వారాల్లో భారీగా కుదేలయ్యాయి. -
ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు
కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్ట్యాప్ల తయారీ కంపెనీ డెల్ లేఖ పంపినట్లు తెలుస్తోంది. -
రూ.1991కే ఫ్లై91 ప్రయాణం
ఫ్లై91 సంస్థ సోమవారం తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం గం.7.55కు బయలుదేరి వెళ్లింది. -
ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగింది: హైర్ ప్రో
అంతక్రితం ఏడాదితో పోలిస్తే, 2022-23 ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగినట్లు ఏఐ పవర్డ్ రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హైర్ ప్రో నివేదిక వెల్లడించింది. -
అంకురాలకు విలువే సర్వస్వం కాదు
పారదర్శకత, నైతిక ప్రవర్తన కోసం స్వీయ నియంత్రణ విధానాన్ని దేశీయ అంకుర సంస్థలు అవలంబించాలని జీ20లో భారత తరపు ప్రధాన ప్రతినిధి (షెర్పా) అమితాబ్ కాంత్ తెలిపారు. -
మదుపర్ల అప్రమత్తత
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్నందున, మదుపర్లు అప్రమత్తత పాటించారు. -
బీమా రంగంలోకి రూ.54,000 కోట్ల ఎఫ్డీఐ
గత తొమ్మిదేళ్లలో బీమా రంగం రూ.54,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. -
బెంగళూరు- లక్షద్వీప్ విమాన సర్వీసు: ఇండిగో
లక్షద్వీప్కు విమాన సదుపాయాన్ని విస్తరించడంలో భాగంగా ఈనెల 31 నుంచి బెంగళూరు- అగత్తి మధ్య నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో సోమవారం వెల్లడించింది. -
మనవడికి రూ.240 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి భారీ బహుమతి ఇచ్చారు. -
సంక్షిప్త వార్తలు
ఈ వేసవిలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అంతర్జాతీయ విమాన సర్వీసులను 20 శాతానికి పైగా పెంచనుంది. దేశ, విదేశీ మార్గాల్లో రోజువారీ 360కి పైగా విమాన సర్వీసులను నడపబోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: ప్రణీత్రావుకు సహకరించింది ఎవరు?
-
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్లో ఎవరున్నారంటే?
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
-
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Salman Khan: సల్మాన్ ఖాన్- అట్లీ కాంబో.. అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే?