AirIndia: ఎయిరిండియా తరలింపు విమానాలకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొస్తోంది....
ముంబయి: రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొస్తోంది. ఈ మేరకు విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతోంది. ఇప్పటి వరకు వందలాది మంది స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే, ఈ ప్రత్యేక తరలింపు కార్యక్రమంలో ఒక్కో విమానం పోయిరావడానికి రూ.1.10 కోట్ల వరకు ఖర్చవుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు.
ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగరీ దేశాలకు ఎయిరిండియా ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతోంది. ఈ తరలింపునకు డ్రీమ్లైనర్గా పిలిచే బోయింగ్ 787 అనే భారీ విమానాన్ని వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వీటిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసమే అద్దెకు తీసుకుంది. సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విమానాన్ని నడపడానికి గంటకు రూ.7-8 లక్షలు ఖర్చవుతోంది. మొత్తం వ్యయం విమానం నడిచే సమయం, దూరంపై ఆధారపడి ఉంటుంది. సిబ్బంది, ఇంధనం, నావిగేషన్, ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలు అన్నింటికీ కలుపుకొని ఇంత వెచ్చించాల్సి వస్తోంది.
ఈ విమానాలు చాలా సేపు ప్రయాణించాల్సి ఉన్న నేపథ్యంలో అదనపు సిబ్బంది అవసరమవుతుంది. కొందరు విధులు నిర్వర్తిస్తుంటే.. మరికొందరు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రొమేనియాలోని బుకారెస్ట్, హంగరీలోని బుడాపెస్ట్లకు ఎయిరిండియా విమానాలను నడుపుతోంది. ఈ రెండూ సంస్థ రెగ్యులర్ షెడ్యూల్లో లేని నగరాలు. ఫ్లైట్వేర్ అనే వెబ్సైట్ ప్రకారం.. బుకారెస్ట్ నుంచి శనివారం ముంబయి చేరుకున్న విమానం దాదాపు ఆరు గంటలు ప్రయాణించింది. బుడాపెస్ట్ నుంచి దిల్లీకి వచ్చిన విమానానికి సైతం దాదాపు అంతే సమయం పట్టింది. ఈ నేపథ్యంలో గంటకు రూ.7-8 లక్షల చొప్పున మొత్తం ప్రయాణానికి రూ.1.10 కోట్లు ఖర్చవుతుందని అంచనా. డ్రీమ్లైనర్ నడవడానికి గంటకు 5 టన్నుల ఇంధనం అవసరమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు