Airtel 5G: కోటి దాటిన ఎయిర్‌టెల్‌ 5జీ యూజర్లు

Airtel 5G: 2022 అక్టోబరు 1న ఎయిర్‌టెల్‌ దేశంలో 5జీ సేవలను ప్రారంభించింది. ఇప్పటి వరకు కోటి మందికి పైగా యూజర్లు ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌లో భాగమయ్యారు.

Updated : 25 Mar 2023 16:08 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కోటికి మందికి పైగా యూజర్లు తమ 5జీ సేవలను వినియోగిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ సోమవారం ప్రకటించింది. 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన కొన్ని నెలల్లోనే కోటి మంది యూనిక్‌ కస్టమర్లను తమ నెట్‌వర్క్‌లో భాగం చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపింది. మరోవైపు మార్చి 2024 కల్లా దేశంలోని ప్రతి పట్టణంలో, కీలక గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది.

2022 అక్టోబరు 1న ఎయిర్‌టెల్‌ దేశంలో 5జీ సేవలను ప్రారంభించింది. నెల వ్యవధిలోనే 10 లక్షల మంది యూజర్లను చేర్చుకొంది. దేశంలో ఈ మైలురాయిని అందుకున్న తొలి టెలికాం ఆపరేటర్‌గా నిలిచింది. సేవలను ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఈ స్థాయిలో స్పందన రావడం పట్ల ప్రోత్సాహకరంగా ఉన్నట్లు ఎయిర్‌టెల్‌ తమ ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఇప్పుడున్న ప్లాన్లతోనే హైస్పీడ్‌ 5జీ సేవలను వినియోగించవచ్చని కంపెనీ ఇప్పటికే చెప్పింది. ఇందుకోసం సిమ్‌ కార్డు సైతం మార్చాల్సిన అవసరం లేదని తెలిపింది. కేవలం 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్‌ చేసే మొబైల్‌ ఉంటే సరిపోతుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని