Airtel 5G: 8 నగరాల్లో ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌ సేవలు.. అప్పటి వరకు 4జీ ప్లాన్లే!

Airtel 5G Plus: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ దేశంలోని హైదరాబాద్‌ సహా 8 నగరాల్లో 5జీ ప్లస్‌ సేవలను ప్రారంభించింది. 

Published : 06 Oct 2022 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel) దేశంలోని 8 నగరాల్లో 5జీ ప్లస్‌ (5G plus) సేవలను ప్రారంభించింది. ఈ సేవలను పొందేందుకు సిమ్‌ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5జీ ఫోన్‌ ఉంటే సరిపోతుందని ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, సిలిగుడి, నాగ్‌పూర్‌, వారణాశి నగరాల్లోని వినియోగదారులు 5జీ+ సేవలను ఆనందించొచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది. దశలవారీగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

ప్రస్తుతం ఉన్న వేగం కంటే 20 నుంచి 30 రెట్ల అధిక వేగంతో 5జీ ప్లస్‌ సేవలను పొందొచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది. 5జీ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చేంత వరకు 4జీ ప్లాన్లతోనే హైస్పీడ్‌ డేటా సేవలు పొందొచ్చని పేర్కొంది. అయితే, 5జీ ఫోన్లన్నీ ఎయిర్‌టెల్‌ 5జీకి సపోర్ట్‌ చేయకపోవచ్చని, దీనికి సంబంధించి మొబైల్‌ తయారుదారులు ఓటీఏ అప్‌డేట్‌ ఇవ్వాల్సి ఉంటుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. 

మరోవైపు దసరా పండగను పురస్కరించుకుని అక్టోబర్‌ 5 నుంచి దిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ట్రయల్‌ బేసిస్‌పై 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు జియో ప్రకటించింది. జియో ట్రూ 5జీ వెల్‌కం ఆఫర్‌ కింద ఈ పైన పేర్కొన్న నగరాలలో జియో యూజర్లకు బీటా ట్రయల్‌ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్‌ కింద వినియోగదారులు 5జీ అన్‌లిమిటెడ్‌ డేటాను 1 జీబీపీఎస్‌ వేగంతో పొందొచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని