Airtel: ఎయిర్టెల్ లక్ష్యం 5 ఏళ్లలో ₹1.17 లక్షల కోట్లు.. 5జీ కోసమే సింహభాగం!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ రాబోయే ఐదేళ్లలో ₹1.17 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ రాబోయే ఐదేళ్లలో ₹1.17 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. తన అనుబంధ సంస్థలైన ఇండస్ టవర్స్, ఎన్ఎక్స్ట్రా (Nxtra), భారతీ హెక్సాకామ్తో ఆ మేరకు వ్యాపార లావాదేవీలను నిర్వహించనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో ఎయిర్టెల్ పేర్కొంది. మరోవైపు ఫిబ్రవరి 26న ఎయిర్టెల్ బోర్డు అసాధారణ సమావేశం (ఈజీఎం) కానుంది. ఇటీవల ₹7,500 కోట్లకు కంపెనీలో 1.25 శాతం వాటాలను గూగుల్కు విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీకి బోర్డు ఆమోదం పొందడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తోంది.
ఈజీఎం నోటీసు ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో వెచ్చించబోయే మొత్తంలో ఒక్క ఇండస్ టవర్స్ కోసం ₹88వేల కోట్లు ఎయిర్టెల్ ఖర్చు చేయనుంది. డేటా సెంటర్ సంస్థ అయిన Nxtra నుంచి సేవలకు గానూ ₹15 వేల కోట్లు, భారతీ హెక్సాకామ్తో లావాదేవీలకు ₹14వేల కోట్లు ఖర్చు పెట్టనుంది. ఈ మూడింట్లో టవర్స్పైనే ఎక్కువ మొత్తం ఎయిర్టెల్ వెచ్చించనుంది.
ప్రస్తుతం 5జీ సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయని, భారత్లోనూ త్వరలోనే ఆ కల సాకారం కానుందని ఎయిర్టెల్ తన ఈజీఎం నోటీసులో పేర్కొంది. ఇందులో భాగంగా తొలుత నగరాల్లోనూ, ఆపై దేశవ్యాప్తంగా తమ నెట్వర్క్ను విస్తరించాలని ఎయిర్టెల్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా 5జీకి కావాల్సిన మౌలిక వసతులను సమకూర్చుకోవడం కోసం ఏడాదికి దాదాపు ₹20వేల కోట్లు చొప్పున 2025-26 వరకు ఖర్చు చేయబోతున్నట్లు ఎయిర్టెల్ ఆ నోటీసులో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!