Ajay Banga: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక లాంఛనమే
Ajay Banga: బంగాకు పోటీగా ఇతర ఏ దేశమూ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే వచ్చిందని ప్రపంచ బ్యాంకు గురువారం ప్రకటించింది.
Ajay Banga | వాషింగ్టన్: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా ఎన్నిక కావడం ఇక లాంఛనమే! ఈ ప్రతిష్ఠాత్మక పదవికి ఆయా దేశాలు తమ అభ్యర్థులను నామినేట్ చేయడానికి బుధవారంతో గడువు ముగిసింది. బంగాకు పోటీగా ఇతర ఏ దేశమూ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. ఈ పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే వచ్చిందని ప్రపంచ బ్యాంకు గురువారం ప్రకటించింది. దీంతో అమెరికా ఎంపిక చేసిన మన అజయ్ బంగా (Ajay Banga)నే ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నిక కానుండడం దాదాపు ఖరారైంది. నిబంధన ప్రకారం వాషింగ్టన్లో ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు అజయ్ బంగాను ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది.
ఆ ప్రక్రియ సవ్యంగా సాగితే.. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్గా, సిక్కు అమెరికన్గా బంగా (Ajay Banga) చరిత్ర సృష్టిస్తారు. ఆయన వయసు 63 ఏళ్లు. ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ కంపెనీ వైస్ ఛైర్మన్గా ఉన్నారు. గతంలో మాస్టర్కార్డ్ అధ్యక్షుడు-సీఈవోగా విధులు నిర్వర్తించారు. 2016లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. అత్యంత కీలకమైన ప్రస్తుత సమయంలో ప్రపంచ బ్యాంకును ముందుండి నడిపించగల సామర్థ్యం బంగాకు ఉందని.. ఆయనను నామినేట్ చేసిన సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. మూడు దశాబ్దాల పాటు పలు అంతర్జాతీయ కంపెనీలను విజయవంతంగా నడిపించిన అనుభవం ఆయన సొంతమని వ్యాఖ్యానించారు. పర్యావరణ మార్పుల అంశం సహా ప్రపంచం ముందు ప్రస్తుతమున్న అన్ని సవాళ్లను బంగా సమర్థంగా ఎదుర్కోగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.
(ఇదీ చదవండి: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి ఎన్నికకు ఇదీ తంతు! )
ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ తన పదవీకాలం ముగియక ముందే పదవీవిరమణ చేయాలని నిర్ణయించుకున్నారు. డేవిడ్ మాల్పాస్ ప్రకటన తర్వాత ప్రపంచ బ్యాంకు నామినేషన్లను స్వీకరించడం మొదలు పెట్టింది. మార్చి 29 వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. సాధారణంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అమెరికన్, ఐఎంఎఫ్ అధ్యక్షుడిగా యూరోపియన్ దేశానికి చెందిన వ్యక్తి ఉండడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా (Ajay Banga) ఎన్నిక కావడం దాదాపు ఖాయమనే అంచనాలు ఆయనను నామినేట్ చేసిన సమయంలోనే వచ్చాయి. ప్రపంచ బ్యాంకులో అత్యధిక వాటా అమెరికాదే. అందువల్ల అధ్యక్షుడి నియామకంలో అగ్రరాజ్యం మాటే చెల్లుబాటు అవుతుంటుంది.
అజయ్ బంగా (Ajay Banga) పుణె లోని ఖడ్కీలో జన్మించారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ఆయన.. ఆహ్మదాబాద్ ఐఐటీలో ఎంబీఏ పూర్తి చేశారు. వాణిజ్యం, పరిశ్రమల రంగంలో ఆయన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం ఆయన్ను గౌరవిస్తూ 2016లో పద్మశ్రీతో సత్కరించింది. 2012లో విదేశాంగ విధాన సంఘం అవార్డు సాధించారు. 2019లో ది ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ హానర్, బిజినెస్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ గ్లోబర్ లీడర్ షిప్ అవార్డు పొందారు.
(ఇదీ చదవండి: అజయ్ బంగా.. మన హెచ్పీఎస్ విద్యార్థే)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. -
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా