Akshaya Tritiya Offers: అక్షయ తృతీయ ఆఫర్లు.. ఆభరణాల కోనుగోలుపై రాయితీలు, క్యాష్బ్యాక్లు
Akshaya Tritiya Offers: అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక ఆభరణాల సంస్థలు ఇప్పటికే ఆఫర్లను ప్రకటించాయి.
Akshaya Tritiya Offers | ఇంటర్నెట్ డెస్క్: హిందువులు శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని ఐశ్వర్యాలకు అధినేత్రిగా పూజిస్తారు. ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలో ఏ లోటూ ఉండదని అంటుంటారు. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ (Akshaya Tritiya 2023) పర్వదినాన బంగారం కొనుగోలు చేయాలని పెద్దలు సూచిస్తుంటారు. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక ఆభరణాల సంస్థలు ఇప్పటికే ఆఫర్ల (Akshaya Tritiya offers)ను ప్రకటించాయి. వాటిలో కొన్ని..
జీఆర్టీ జ్యువెలర్స్ (GRT Jewellers): బంగారు ఆభరణాల తరుగుపై 20 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. వజ్రాలు, అన్కట్ వజ్రాల విలువపై 10 శాతం, వెండి వస్తువుల తయారీ ఛార్జీలపై 25 శాతం తగ్గింపు, వెండి ఆభరణాల ఎంఆర్పీపై 10 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. బంగారు నాణేలపై తరుగు లేదని ప్రకటించింది. ధరల హెచ్చుతగ్గుల నుంచి వినియోగదారులు రక్షణ పొందేందుకు ఆభరణాలను ముందుగా బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నామని తెలిపింది. అక్షయ తృతీయ రోజు ధర తగ్గితే వ్యత్యాసం తిరిగి ఇస్తామని జీఆర్టీ జ్యువెలర్స్ ఎండీ జి.ఆర్.రాధాకృష్ణన్ తెలిపారు.
లలితా జ్యువెలర్స్: అన్ని బంగారు నగలకు తరుగులో ఒక శాతం తగ్గింపునిస్తోంది. అన్ని వజ్రాభరణాలకు క్యారెట్లో రూ.2,000 వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అలాగే బంగారు నాణేలపై ఎటువంటి తరుగును తీయబోమని లలితా జ్యువెలర్స్ ప్రకటించింది.
ఫోన్పే: తమ యాప్ ద్వారా 24 క్యారెట్ల స్వచ్ఛత బంగారాన్ని కొనుగోలు చేసేవారికి ఉచిత స్టోరేజ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఫోన్పే తెలిపింది. అలాగే ఎలాంటి మేకింగ్ ఛార్జీలు కూడా ఉండవని ప్రకటించింది. కస్టమర్ తరఫున విక్రేతలే బ్యాంక్ గ్రేడ్ ఇన్సూర్డ్ లాకర్లో భద్రపరుస్తారని తెలిపింది. దీన్ని కస్టమర్లు ఎప్పుడైనా విక్రయించుకోవచ్చని పేర్కొంది. డబ్బును 48 గంటల్లో బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చింది. 1 గ్రాము కంటే ఎక్కువ బంగారాన్ని అక్షయ తృతీయ (ఏప్రిల్ 22న) రోజు కొనుగోలు చేసినవారికి రూ.50 నుంచి రూ.500 క్యాష్బ్యాక్ లభిస్తుందని వెల్లడించింది.
జోయలుక్కాస్ (Joyalukkas): రూ.10 వేల కంటే ఎక్కువ విలువ చేసే వెండి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి రూ.500 విలువ చేసే గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. రూ.50 వేలు అంతకంటే ఎక్కువ విలువ చేసే బంగారు ఆభరణాలు కొంటే రూ.1,000 గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. అలాగే వజ్రాలు, అన్కట్ వజ్రాలు, అరుదైన ఆభరణాల కొనుగోలు విలువ రూ.50 వేలు దాటితే రూ.2,000 గిఫ్ట్ వోచర్ను ఇవ్వనున్నారు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అయితే, కార్డుతో చేసే కొనుగోళ్ల విలువ రూ.30,000 దాటాలి. ఈ ఆఫర్లు ఏప్రిల్ 23 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
తనిష్క్ (Tanishq): బంగారం, వజ్రాభరణాల తయారీ ఛార్జీలపై 20 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. ముందుగానే బుక్ చేసుకునేవారికి గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ కూడా ఉంది. మరోవైపు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కనీసం రూ.80 వేల కొనుగోళ్లు చేసేవారికి రూ.4,000 తక్షణ రాయితీ లభిస్తుంది. ఈ ఆఫర్లు ఏప్రిల్ 23 వరకు అందుబాటులో ఉన్నాయి.
కల్యాణ్ జ్యువెలర్స్ (Kalyan Jewellers): కొనుగోలు మొత్తంలో సగం విలువ చేసే ఆభరణాలపై సున్నా శాతం మాత్రమే తయారీ ఛార్జీలు ఉంటాయి. అయితే, కనీసం రూ.1 లక్ష విలువ చేసే ఆభరణాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
మలబార్ గోల్డ్ (Malabar Gold): రూ.30,000 విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే వారికి ఉచితంగా 100 మిల్లీగ్రాముల బంగారు నాణేన్ని అందిస్తున్నారు. ఒకవేళ రూ.30,000 విలువైన డైమండ్, ఇతర విలువైన ఆభరణాలను కొంటే 250 మి.గ్రా బంగారు నాణేలను సంస్థ అందజేస్తోంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి అదనంగా మరో 5 శాతం క్యాష్బ్యాక్ కూడా ఉంటుంది.
క్యారట్లేన్ (Caratlane): అన్ని డిజైన్ల వజ్రాభరణాలపై 20 శాతం వరకు తగ్గింపును క్యారట్లేన్ అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు చేసేవారికి అదనంగా 5 శాతం రాయితీ కూడా ఇస్తోంది.
పీసీ జ్యువెలర్స్ (PC Jewellers): బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 50 శాతం తగ్గింపునిస్తోంది.
(గమనిక: పై వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. ఆఫర్లపై ఆయా కంపెనీల రిటైల్ స్టోర్లను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. అలాగే ఆఫర్లను పొందేందుకు ఉండే షరతులపై స్పష్టత వస్తుంది)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు