Amazon Prime Day sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలు ఫిక్స్.. ఈ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు!
Amazon Prime Day sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ పేరిట (Amazon Prime Day sale) సేల్ అమెజాన్ నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన తేదీలను తాజాగా అధికారికంగా ప్రకటించింది.
Amazon prime day sale: షాపింగ్ ప్రియులకు గుడ్న్యూస్. ప్రైమ్ మెంబర్ల కోసం అమెజాన్ కొత్త సేల్ తీసుకొస్తోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ పేరిట (Amazon Prime Day sale) సేల్ నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన తేదీలను తాజాగా అధికారికంగా ప్రకటించింది. జులై 23-24 తేదీల్లో ఈ సేల్ నిర్వహించబోతున్నారు. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, టీవీలు, దుస్తులు, అమెజాన్ డివైజులు, ఫర్నిచర్పై తదితర వస్తువులపై ఈ సేల్లో డిస్కౌంట్లు అందించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. జులై 23 అర్ధరాత్రి 12 గంటల నుంచి 48 గంటల పాటు ఈ సేల్ జరగనుంది. 400 బ్రాండ్లకు చెందిన 30వేల కొత్త ఉత్పత్తులను విక్రయానికి ఉంచనున్నట్లు అమెజాన్ తెలిపింది. ఐసీఐసీఐ, ఎస్బీఐ కార్డుదారులకు 10 శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ పేర్కొంది.
సేల్కు సంబంధించి ఇప్పటికే ఓ పేజీని అమెజాన్ సిద్ధం చేసింది. ఇందులో మొబైల్స్పై 40 శాతం వరకు, ల్యాప్టాప్లు, హెడ్ఫోన్స్పై 75 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు పేర్కొంది. ఎక్స్ఛేంజీ సదుపాయం కూడా ఉందని తెలిపింది. ఈ సేల్లో భాగంగా షావోమి, వన్ప్లస్, శాంసంగ్, ఐకూకు చెందిన కొన్ని మొబైల్స్ను తక్కువ ధరకే విక్రయించనున్నామని పేర్కొన్న అమెజాన్.. వాటి ధరలను మాత్రం రివీల్ చేయలేదు. సేల్ తేదీలు దగ్గరకొచ్చాక వాటి ధరలను తెలిపే అవకాశం ఉంది. అయితే ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్లకు మాత్రమే. కొత్తగా ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఏడాదికి రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. కేవలం నెలకు మాత్రమే తీసుకోవాలంటే రూ.179 చెల్లించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
WhatsApp payments: వాట్సప్లో పేమెంట్స్ ఇక మరింత సులువు కానుంది. చాట్ లిస్ట్లోనే ఇకపై క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించనుంది. -
MNP: మొబైల్ నంబర్ పోర్టింగ్కు కొత్త రూల్.. జులై 1 నుంచి అమల్లోకి
Mobile Number portability: మొబైల్ నంబర్ పోర్టింగ్కు ట్రాయ్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. -
Narayana Murthy: మనవడికి నారాయణమూర్తి ఖరీదైన గిఫ్ట్
నారాయణ మూర్తి తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. తాత ఇచ్చిన బహుమతితో భారత్లోనే అత్యంత పిన్నవయస్కుడైన బిలియనీర్ల జాబితాలో ఏకాగ్రహ్ చోటు దక్కించుకున్నాడు. -
Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 104, నిఫ్టీ 32 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
Dell: ఆఫీసుకు రాకపోతే ప్రమోషన్లు ఉండవ్.. ఉద్యోగులకు డెల్ నోటీసు!
Dell: టెక్ కంపెనీలన్నీ ఇంటి నుంచి పని విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. ఉద్యోగులంతా ఆఫీసుకు రావాలని ఆదేశిస్తున్నాయి. ఈ తరుణంలో డెల్ కీలక నిర్ణయం తీసుకుంది. -
Adani group: నష్టాల్లో అదానీ గ్రూప్ స్టాక్స్.. అమెరికా దర్యాప్తు ఎఫెక్ట్
Adani group: అదానీ గ్రూప్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. దానిపై అమెరికా సంస్థలు దర్యాప్తు చేపట్టాయని వస్తున్న వార్తలే ఇందుకు కారణం. -
Jio - IPL: ఐపీఎల్ సందడి.. జియో యూజర్లకు డేటా ప్యాక్లు
Jio - IPL: ఐపీఎల్ వీక్షించాలనుకునేవారికి జియోలో రెండు అనువైన డేటా ప్యాక్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలేంటో చూద్దాం..! -
Bill Gates: ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను: బిల్ గేట్స్
స్టీవ్ జాబ్స్లా బహిరంగ సమావేశాల్లో సహజంగా వ్యవహరించలేనని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. -
Uber: ఆస్ట్రేలియాలో ట్యాక్సీ డ్రైవర్లకు ఉబర్ రూ.1,475 కోట్ల పరిహారం
Uber: ఉబర్ వల్ల ఉపాధి కోల్పోయామంటూ కోర్టును ఆశ్రయించిన ట్యాక్సీ డ్రైవర్లకు రూ.1,475 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఆ కంపెనీ అంగీకరించింది. -
Stock Market: ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,000
Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 4 పాయింట్ల స్వల్ప లాభంతో 72,647 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లు కుంగి 22,007 దగ్గర కొనసాగుతోంది. -
స్మాల్క్యాప్ ప్రకంపనలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు స్మాల్క్యాప్ షేర్లు దూసుకెళ్లాయి. గత నెలరోజుల వ్యవధిలో మాత్రం ఇవి మదుపర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 19 వరకు బీఎస్ఈ సెన్సెక్స్ 24% లాభపడితే, స్మాల్క్యాప్ సూచీ 71% దూసుకెళ్లడం గమనార్హం. -
అదానీ గ్రూప్ రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.1.2 లక్షల కోట్లు (దాదాపు 14 బి.డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. ఇంధన, విమానాశ్రయాలు, కమొడిటీస్, సిమెంట్, మీడియా సహా పలు గ్రూప్ కంపెనీల్లో ఈ పెట్టుబడులు పెట్టనుంది. -
ఫెడ్ వ్యాఖ్యలు కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఊగిసలాటకు గురికావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మొత్తం మీద మార్కెట్లు సానుకూలంగానే ఉండొచ్చని అంటున్నారు. జపాన్, అమెరికా, బ్రిటన్ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుండటమే ఇందుకు కారణం. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఏప్రిల్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.66,022 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.66,502; రూ.66,822 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. -
72000- 72590 పాయింట్ల శ్రేణి కీలకం!
జీవనకాల తాజా గరిష్ఠాల నుంచి సూచీలు గతవారంలో వెనక్కి వచ్చాయి. చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల విలువలు బుడగల్లా ఉన్నాయని, మదుపర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సెబీ పేర్కొనడం ప్రతికూల ప్రభావం చూపింది. -
ఈ వారంలో 3 కొత్త ఐపీఓలు
ఈ వారం మూడు కంపెనీల ఐపీఓలు మదుపర్ల ముందుకు రానున్నాయి. ఇవి ప్రధాన విభాగంలోనివి కావు. చిన్న, మధ్య స్థాయి (ఎస్ఎంఈ) విభాగానికి చెందిన 3 కంపెనీలు మొత్తం రూ.86.8 కోట్లు సమీకరించనున్నాయి. -
సంక్షిప్త వార్తలు
ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ విలువ రెండేళ్లలో 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.41,000 కోట్లు) తగ్గింది. 2022 జనవరి 31కి సంస్థ విలువ 40 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది జనవరి చివరకు సంస్థ విలువ 35 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. -
Flipkart: ఐఫోన్ ఆర్డర్ క్యాన్సిల్.. ఫ్లిప్కార్ట్కు రూ.10,000 జరిమానా!
Flipkart: ఐఫోన్ ఆర్డర్ను ఏకపక్షంగా క్యాన్సిల్ చేయడం వల్ల కస్టమర్ తీవ్ర మనోవేదనకు గురయ్యారని.. అందుకు ఫ్లిప్కార్ట్ రూ.10,000 జరిమానా చెల్లించాలని సెంట్రల్ ముంబయికి చెందిన ‘జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్’ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
BJP-JDS: ‘రెండు సీట్లకు ఇంత కష్టపడాలా?’ భాజపాపై కుమారస్వామి అసంతృప్తి!
-
Kolkata: భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిదికి చేరిన మృతులు
-
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
-
IPL: బెరెన్డార్ఫ్ ఔట్.. ఇంగ్లాండ్ పేసర్కు ముంబయి ఇండియన్స్ పిలుపు
-
Online Voting: వారికి ఆన్లైన్ ఓటింగ్ కల్పించాలి: మాజీ సీఈసీ కృష్ణమూర్తి
-
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం