Mukesh Ambani: రిలయన్స్కు వారసులొచ్చేశారు.. ఆకాశ్, ఈశా, అనంత్కు బాధ్యతలివే..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యంలో మూడోతరం పాలనా పగ్గాలకు చేపట్టే ప్రక్రియకు ముకేశ్ అంబానీ బాటలు
దిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యంలో మూడోతరం పాలనా పగ్గాలకు చేపట్టే ప్రక్రియకు ముకేశ్ అంబానీ బాటలు వేశారు. సోమవారం జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో వారసత్వ ప్రణాళికను బయటపెట్టారు. తన వ్యాపార బాధ్యతలను చూసుకునే భవిష్యత్ లీడర్లు వీరేనంటూ వారసులు ఆకాశ్, ఈశా, అనంత్ అంబానీల పేర్లను ప్రకటించారు. పెద్ద కుమారుడు ఆకాశ్కు జియో బాధ్యతలు అప్పగించగా.. కుమార్తె ఈశాకు రిలయన్స్ రిటైల్, చిన్న కుమారుడు అనంత్కు న్యూ ఎనర్జీ విభాగాలను అప్పజెప్పారు. అయితే తానేం రిటైర్ అవడం లేదని స్పష్టం చేశారు. మునపటిలాగే కంపెనీ నాయకత్వ బాధ్యతలను కొనసాగిస్తానని వెల్లడించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్కు ప్రధానంగా మూడు రంగాల్లో వ్యాపారాలున్నాయి. చమురు శుద్ధి - పెట్రోకెమికల్స్, రిటైల్, డిజిటల్ సర్వీసెస్ వ్యాపారాలను కంపెనీ నిర్వహిస్తోంది. ఇందులో రిటైల్, డిజిటల్ సర్వీసెస్ను అనుబంధ సంస్థలతో కొనసాగిస్తున్నారు. టెలికాం సేవలందించే డిజిటల్ సర్వీసెస్ను జియో ఇన్ఫోకామ్ పేరుతో, రిటైల్ విభాగాన్ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ పేరుతో నడిపిస్తున్నారు. ఇక, ఆయిల్ టు కెమికల్తో పాటు న్యూ ఎనర్జీ వ్యాపారాలను మాతృ సంస్థ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ఇక తన వ్యాపారాల్లాగే అంబానీకి ముగ్గురు వారసులున్నారు. ఈ క్రమంలోనే కంపెనీ నాయకత్వంలో వారసత్వ ప్రణాళికను ముకేశ్ అంబానీ తాజాగా ప్రకటించారు.
అనంత్కు న్యూ ఎనర్జీ..
ఇప్పటికే జియో బాధ్యతలను ఆకాశ్ను అధికారికంగా అప్పగించగా.. ఈశా, అనంత్ కంపెనీ బోర్డుల్లో సభ్యులుగా ఉన్నారు. తాజాగా వీరిద్దరికీ వ్యాపారాల్లో నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. ‘‘జియో, రిటైల్లో ఆకాశ్, ఈశా ఇప్పటికే కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వినియోగదారుల వ్యాపారాలను ప్రారంభించినప్పటి నుంచి వారు ఎంతో ఉత్సాహంగా వాటిల్లో భాగస్వాములయ్యారు. ఇప్పుడు అనంత్ కూడా మరింత ఉత్సాహంతో మా న్యూ ఎనర్జీ వ్యాపారంలో చేరాడు. నిజం చెప్పాలంటే అనంత్ చాలా రోజుల నుంచి జామ్నగర్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు’’ అని వార్షిక సమావేశంలో అంబానీ చెప్పుకొచ్చారు. సోలార్, బ్యాటరీ, హైడ్రోజన్ పెట్టుబడులున్న న్యూ ఎనర్జీ విభాగాన్ని అనంత్కు అప్పజెప్పారు.
తన తండ్రి, కంపెనీ వ్యవస్థాపకులు ధీరూబాయ్ ఆలోచనా విధానాన్ని ఈ యువ నాయకులు వారసత్వంగా పొందారని, ఇప్పటికే కంపెనీలో అద్భుతంగా రాణిస్తున్నారని ప్రశంసించారు. అయితే, వీరి పనితీరును తనతో పాటు బోర్డు డైరెక్టర్లు, కంపెనీ సీనియర్ లీడర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంటారని, వారికి అవసరమైన సలహాలు ఇస్తుంటారని స్పష్టం చేశారు.
రిలయన్స్ రారాణి ఈశా..
ఈ ఏడాది జూన్లో ఆకాశ్ను జియో ఫ్లాట్ఫామ్స్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్గా నియమించిన విషయం తెలిసిందే. అయితే జియో ఫ్లాట్ఫామ్ ఛైర్మన్గా మాత్రం అంబానీనే వ్యవహరిస్తున్నారు. ఇక రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్కు కూడా అంబానీనే ఛైర్మన్గా ఉండగా.. ఈశాను రిటైల్ వ్యాపారానికి నాయకురాలిగా ప్రకటించారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో 2014 నుంచి ఆకాశ్, ఈశా బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఈ విభాగం కింద ఎలక్ట్రానిక్స్, ఆహార పదార్థాలు, ఫ్యాషన్, జ్యూవెలరీ, ఫుట్వేర్, దుస్తుల, జియోమార్ట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక జియో ఫ్లాట్ఫామ్స్ లిమిటెడ్లోనూ వీరు బోర్డు డైరెక్టర్లుగా ఉన్నారు. అనంత్ 2020 మే నెలలో రిలయన్స్ రిటైల్లో బోర్డు డైరెక్టర్గా చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.