Ambani: అంబానీ ఇంట పెళ్లి సందడి.. ఘనంగా అనంత్-రాధిక నిశ్చితార్థం
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన స్నేహితురాలు రాధికా మర్చంట్తో అనంత్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
ముంబయి: అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లిసందడి మొదలైంది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి, మర్చంట్ వారసురాలైన రాధికా మర్చంట్కు గురువారం నిశ్చితార్థం జరిగింది. రాజస్థాన్లోని నాథ్ద్వారాలోని శ్రీనాథ్జీ ఆలయంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. దీనికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: Radhika Merchant: అంబానీకి కాబోయే చిన్నకోడలి గురించి ఈ విశేషాలు తెలుసా?
రాధికకు అనంత్కు కొద్ది సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. వీరిద్దరూ వారి వారి కుటుంబాలకు చెందిన వ్యాపారాల్లో చురుగ్గా ఉన్నారు. అనంత్ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందిన ఆయన.. తర్వాత నుంచి రిలయన్స్లోని జియో, రిటైల్ వెంచర్స్ బోర్డుల్లో సభ్యుడిగా, వివిధ హోదాల్లో సేవలు అందించారు. ప్రస్తుతం ఈ సంస్థలోని ఎనర్జీ బిజినెస్కు నేతృత్వం వహిస్తున్నారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి రాధిక గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ప్రస్తుతం ఎన్కోర్ హెల్త్కేర్ బోర్డు డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు శైలా, వీరెన్ మర్చంట్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Avinash Reddy: ఏడు గంటలపాటు సాగిన అవినాష్రెడ్డి సీబీఐ విచారణ
-
India News
Smriti Irani: జర్నలిస్టును ‘బెదిరించిన’ స్మృతి ఇరానీ.. వీడియో షేర్ చేసిన కాంగ్రెస్
-
Sports News
WTC Final: వారి ఆటతీరు.. టాప్ఆర్డర్కు గుణపాఠం: సౌరభ్ గంగూలీ
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Harishrao: ఏపీ నేతలకు మాటలెక్కువ.. చేతలు తక్కువ: హరీశ్రావు
-
India News
MHA: మణిపుర్ హింసాత్మక ఘటనలు..! శాంతి స్థాపనకు కమిటీ ఏర్పాటు