కేంద్రాన్ని రూ.700 కోట్ల ప్రత్యేకసాయం కోరిన ఏపీ!

ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని రూ.16,467 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అడిగాయని కేంద్రం సోమవారం లోక్‌సభలో వెల్లడించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌

Published : 22 Mar 2021 20:43 IST

లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి వెల్లడి

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని రూ.16,467 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అడిగాయని కేంద్రం సోమవారం లోక్‌సభలో వెల్లడించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌, గోవా, మణిపూర్‌, నాగాలాండ్‌ నుంచి అభ్యర్థనలు అందినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ రూ.700 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.

పోర్చుగీసు వలస పాలన ముగిసి 60 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రత్యేక ఉత్సవాల కోసం గోవా రూ.500 కోట్లు అడిగినట్లు ఠాకూర్‌ తెలిపారు. వివిధ రంగాల్లో అభివృద్ధి పనుల కోసం మణిపూర్‌ రూ.14,567 కోట్లు, నాగాలాండ్‌ రూ.700 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కోసం విజ్ఞప్తులు పంపినట్లు వెల్లడించారు. నిబంధనల ప్రకారం.. ఆయా రాష్ట్రాల ప్రతిపాదనలు పరిశీలించి ఆర్థిక వనరుల లభ్యత మేరకు ప్రత్యేక గ్రాంట్ల కింద సాయం అందిస్తామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ‘రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ-2014’ చట్టం కింద అందాల్సిన నిధులను నీతి ఆయోగ్‌ సిఫార్సుల మేరకు విడుదల చేస్తామని వెల్లడించారు.

ఇవీ చదవండి..

ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలి: సుప్రీం

ఏపీలో ఒంటిపూట బడులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని