దేశంలో ఐఫోన్ 13 తయారీని ప్రారంభించిన యాపిల్..
ఐఫోన్ SE మోడళ్ల తయారీని 2017 సంవత్సరంలోనే భారతదేశంలో ప్రారంభించినట్లు యాపిల్ పేర్కొంది
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్, ఐఫోన్ 13 ఉత్పత్తిని మన దేశంలో ప్రారంభించింది. చెన్నైకి సమీపంలో ఉన్న యాపిల్ కాంట్రాక్ట్ తయారీ భాగస్వామి అయిన ఫాక్స్కాన్ ఫెసిలిటీలో ఈ ఫోన్ తయారవుతుందని సంస్థ తెలిపింది.
భారతదేశంలోని తమ కస్టమర్ల కోసం అందమైన డిజైన్, సహజత్వం ఉట్టిపడేలా ఫోటోలు, వీడియోల కోసం అధునాతన కెమెరా సిస్టమ్, అద్భుతమైన పనితీరు కోసం A15 బయోనిక్ చిప్ అమర్చిన ఐఫోన్ 13 ని భారత్ దేశం లో తయారు చేయడం ప్రారంభించినందుకు ఎంతగానో సంతోషిస్తున్నామని యాపిల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఐఫోన్ SE మోడళ్ల తయారీని 2017 సంవత్సరంలోనే భారతదేశంలో ప్రారంభించినట్లు యాపిల్ పేర్కొంది. అప్పటి నుంచి మన దేశంలో ఐఫోన్ 11, ఐఫోన్ 12 వంటి ప్రీమియం మొబైల్స్ ను తయారు చేస్తున్న యాపిల్, తాజాగా ఐఫోన్ 13 తయారీని ప్రారంభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్