Audi price hike: ‘ఆడి’ కార్ల ధరల పెంపు.. ఎప్పటి నుంచంటే?

ప్రముఖ విలాసవంత కార్ల తయారీ సంస్థ ఆడి కార్ల ధరలను పెంచనుంది. మోడల్‌ను బట్టి పెంపు 2.4 శాతం వరకు ఉంటుందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది...

Published : 23 Aug 2022 14:41 IST

దిల్లీ: ప్రముఖ విలాసవంత కార్ల తయారీ సంస్థ ఆడి తమ కార్ల ధరలను పెంచనుంది. మోడల్‌ను బట్టి పెంపు 2.4 శాతం వరకు ఉంటుందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. పెంచిన ధరలు వచ్చే నెల 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ముడి సరకుల ధరలు, సరఫరా వ్యయాలు పెరగడమే తాజా పెంపునకు కారణమని వెల్లడించింది. ఆడి ఇండియా భారత్‌లో ఏ4, ఏ6, ఏ8 ఎల్‌, క్యూ5, క్యూ7, క్యూ8, ఎస్‌5 స్పోర్ట్‌బ్యాక్‌, ఆర్‌ఎస్‌5 స్పోర్ట్‌బ్యాక్‌, ఆర్‌ఎస్‌ క్యూ8 పెట్రోల్‌ మోడళ్లను విక్రయిస్తోంది. ఇ-ట్రాన్‌ బ్రాండ్‌ పేరిట ఇ-ట్రాన్‌ 50, ఇ-ట్రాన్‌ 55, ఇ-ట్రాన్‌ జీటీ, ఆర్‌ఎస్‌ ఇ-ట్రాన్‌ జీటీ ఎలక్ట్రిక్‌ వాహనాలను అమ్ముతోంది. ఇటీవలే క్యూ3 మోడల్‌కు బుకింగ్స్‌ ప్రారంభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని