Landmark Cars IPO: 13న ల్యాండ్మార్క్ కార్స్ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.481-506
డిసెంబరు 13న ల్యాండ్మార్క్ కార్స్ ఐపీఓ ప్రారంభం కానుంది. ధరల శ్రేణిని రూ.481-506గా నిర్ణయించింది.
దిల్లీ: ఆటోమొబైల్ డీలర్షిప్ చైన్ ల్యాండ్మార్క్ కార్స్ లిమిటెడ్ తమ ఐపీఓ (Landmark Cars IPO) ధరల శ్రేణిని రూ.481-506గా నిర్ణయించింది. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ డిసెంబరు 13 నుంచి 15 వరకు జరగనుంది. రూ.150 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు రూ.402 కోట్లు విలువ చేసే షేర్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద ఐపీఓలో అందుబాటులో ఉండనున్నాయి.
సమీకరించిన నిధుల నుంచి రూ.120 కోట్లు రుణ భారాన్ని తగ్గించుకోవడానికి, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలను వినియోగించనున్నారు. ఇష్యూ (IPO) పరిమాణంలో 50 శాతం అర్హతగల సంస్థాగత మదుపర్లు, 35 శాతం రిటైల్ మదుపర్లు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు రిజర్వు చేశారు. మదుపర్లు కనీసం 29 ఈక్విటీ షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఈ ఐపీఓకి లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో డిసెంబరు 23న లిస్ట్ కానున్నాయి.
టీపీజీ మద్దతు గల ల్యాండ్మార్క్ కార్స్ (Landmark Cars IPO) దేశంలో ప్రీమియం కార్ల రిటైల్ విక్రయాలకు వేదికగా ఉంది. ఇది మెర్సిడెస్ బెంజ్, హోండా, జీప్, ఫోక్స్వ్యాగన్, రెనోకు రిటైల్ డీలర్గా వ్యవహరిస్తోంది. కొత్త వాహనాల విక్రయాలతో పాటు విడిభాగాలు, ల్యూబ్రికెంట్స్, యాక్సెసరీస్ విక్రయాలు, మరమ్మతుల వంటి సేవలనూ అందిస్తోంది. అలాగే పాత కార్ల క్రయ విక్రయ వ్యాపారాన్నీ నిర్వహిస్తోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.28.93 కోట్ల నష్టాన్ని నివేదించింది. బీఎస్-IV కార్ల స్టాక్ను పూర్తిగా విక్రయించడం కోసం కంపెనీ భారీ ఎత్తున రాయితీలు కల్పించడమే దీనికి కారణం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08/02/23)
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Politics News
Kotamreddy: అమరావతి రైతులను పరామర్శించడమే నేను చేసిన నేరమా?: కోటంరెడ్డి
-
General News
TTD: ఫిబ్రవరి 9న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల