Interest Rates: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన యాక్సిస్‌ బ్యాంక్‌

యాక్సిస్‌ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లను 75 బీపీఎస్‌ వరకు పెంచింది.

Updated : 14 Oct 2022 16:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌బీఐ రెపో రేటును 5.90% వరకు పెంచిన తర్వాత చాలా బ్యాంకులు తమ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచాయి. ఇప్పుడు యాక్సిస్‌ బ్యాంకు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లను 75 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. ఈ బ్యాంకు ఇంతకు ముందు అక్టోబరు 1న ఎఫ్‌డీ రేట్లను పెంచింది. ఇప్పుడు బ్యాంకు 7 రోజుల నుంచి 29 రోజులలో మెచ్యూర్‌ అయ్యే తక్కువ కాలవ్యవధి ఎఫ్‌డీలపై కనీస వడ్డీ రేటును 3.50%గా ప్రకటించింది. సాధారణ డిపాజిటర్లకు 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల లోపు మెచ్యూర్‌ అయ్యే డిపాజిట్లపై బ్యాంకు 6.20% వడ్డీని ఇస్తుంది. సీనియర్‌ సిటిజన్లు అయితే 30 నెలల కాల వ్యవధికి 6.95% వరకు గరిష్ఠ వడ్డీని పొందుతారు. యాక్సిస్‌ బ్యాంకు NRE, FCNR డిపాజిట్ల వడ్డీ రేట్లను కూడా పెంచింది. ఈ వడ్డీ రేట్లు రూ. 2 కోట్లలోపు ఉన్న డిపాజిట్లకు వర్తిస్తాయి. ఈ కొత్త రేట్లు అక్టోబరు 14 నుంచి అమల్లో ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని