FDs: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన యాక్సిస్‌ బ్యాంకు

ఆర్‌బీఐ రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచిన నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంకు తన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది.

Published : 11 Feb 2023 20:34 IST

దిల్లీ: ఆర్‌బీఐ  రెపో రేటు పెంపునకు అనుగుణంగా యాక్సిస్‌ బ్యాంక్‌ (Axis Bank) తన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల్లో మెచ్యూర్‌ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లను సాధారణ డిపాజిటర్లకు 3.50% నుంచి 7.26%, సీనియర్‌ సిటిజన్లకు గరిష్ఠంగా 8.01% వరకు వడ్డీ రేటును అందిస్తోంది. ఒక సంవత్సరం 25 రోజుల ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లు 7.10% వడ్డీ రేటును అందుకోవచ్చు. రెండు సంవత్సరాల నుంచి 30 నెలల మెచ్యూరిటీ వ్యవధి ఉన్న డిపాజిట్లు చేసిన సీనియర్‌ సిటిజన్లకు గరిష్ఠంగా 8.01%, సాధారణ డిపాజిటర్లకు 7.26% వడ్డీ రేటు లభిస్తుంది. యాక్సిస్‌ బ్యాంకు  వెబ్‌సైట్‌ ప్రకారం.. కొత్త రేట్లు 2023 ఫిబ్రవరి 11 నుంచి అమల్లోకి వస్తాయి. రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని