Loan written off: 5 ఏళ్లలో ₹10 లక్షల కోట్ల రుణాల రైటాఫ్!
గడిచిన ఐదేళ్లలో మొత్తం రూ.10 లక్షల కోట్ల మేర మొండి బాకీలను బ్యాంకులు సాంకేతికంగా రద్దు చేసినట్లు కేంద్రం పార్లమెంట్కు తెలిపింది.
దిల్లీ: గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10లక్షల కోట్ల (రూ.10,09,511కోట్లు) విలువైన మొండి బాకీలను (NPA) బ్యాంకులు రైటాఫ్ (written off) చేశాయని కేంద్రం పార్లమెంట్కు తెలిపింది. రాజ్యసభలో ఓ సభ్యుడి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) ఈ మేరకు సమాధానమిచ్చారు. నాలుగేళ్లు దాటిన మొండి బకాయిలను బ్యాంకులు (Banks) రైటాఫ్ పేరిట తమ బ్యాలెన్స్ షీట్ల నుంచి తొలగిస్తాయని పేర్కొన్నారు. రైటాఫ్ అంటే సాంకేతికంగా రద్దు చేసినట్లే గానీ.. రుణాలు పూర్తిగా మాఫీ చేసినట్లు కాదని చెప్పారు.
‘‘తమ బ్యాలెన్స్ షీట్లను క్లీన్ చేసేందుకు బ్యాంకులు మొండి బకాయిల రైటాఫ్ ప్రక్రియను నిరంతరం చేపడుతుంటాయి. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి సంబంధిత బ్యాంకు బోర్డు ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకుంటాయి. వాణిజ్య బ్యాంకుల నుంచి ఉన్న సమాచారం ప్రకారం.. గడిచిన ఐదేళ్లలో మొత్తం రూ.10,09,511 కోట్ల రుణాలు రైటాఫ్ అయ్యాయి’’ అని కేంద్రమంత్రి తెలిపారు.
రుణాలు రైటాఫ్ చేసినప్పటికీ వాటిని తీసుకున్నవారు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. రైటాఫ్ వల్ల రుణ గ్రహీతకు ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదని తెలిపారు. అలాగే బ్యాంకులు సైతం సివిల్ కోర్టుల్లో దావాలు వేయడం, రుణ రికవరీ ట్రైబ్యునళ్లను ఆశ్రయించడం, దివాలా స్మృతి కింద కేసులు నమోదు చేయడం, నిరర్థక ఆస్తుల విక్రయం వంటి ప్రక్రియల ద్వారా రుణాలను రికవరీ చేస్తున్నాయని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో రైటాఫ్ చేసిన రుణాల్లో రూ.1.32 లక్షల కోట్లు సహా మొత్తం రూ.6.59 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు రికవరీ చేశాయని మంత్రి వివరించారు.
బ్యాంకుల మొండి బాకీల విషయంలో ఆయా బ్యాంకు అధికారులే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో ఎన్పీఏలకు సంబంధించి మొత్తం 3,312 మంది ప్రభుత్వ బ్యాంకు అధికారులను జవాబుదారీ చేస్తూ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు మాత్రమే బ్లాక్చైన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయని, అదీ పరిమితంగానే అంటూ మరో ప్రశ్నకు నిర్మలా సీతారామన్ జవాబిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.