Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి మస్క్!
బ్లూమ్బర్గ్ తాజాగా విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ మరోసారి రెండో స్థానానికి పడిపోయారు. గతవారం ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ ధనవంతుల జాబితాలో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ తొలిస్థానంలో నిలువగా, మస్క్ రెండో స్థానానికి పరిమితమయ్యారు.
న్యూయార్క్: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon musk) ప్రపంచ కుబేరుల జాబితాలో (Billionaire rankings) మొదటి స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానాన్ని ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault) దక్కించుకున్నారు. బ్లూమ్బర్గ్ బిలయనీర్ ఇండెక్స్తాజా నివేదిక ప్రకారం న్యూయార్క్లో ఉదయం 10:20 గంటల సమయంలో మస్క్ సంపద 168.5 బిలియన్ డాలర్లుగా ఉండగా.. బెర్నార్డ్ సంపద విలువ 172.9 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో మస్క్ను వెనక్కినెట్టి బెర్నార్డ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గతవారం ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ ధనవంతుల జాబితాలో బెర్నార్డ్ తొలిస్థానంలో నిలవగా.. మస్క్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఈ ర్యాంకులు ప్రకటించిన కొద్దిసేపటికే మస్క్ తన వ్యక్తిగత సంపద విలువను పెంచుకుని తొలిస్థానానికి చేరుకున్నారు. తాజాగా మరోసారి మస్క్ వ్యక్తిగత ఆస్తుల విలువ తగ్గడంతో ఆయన రెండో స్థానానికి దిగజారారు.
మస్క్ ట్విటర్ కొనుగోలు చేసిన నాటి నుంచి ఆయన వ్యక్తిగత సంపద విలువ తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ డీల్ను పూర్తి చేసేందుకు మస్క్19 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను రెండు దఫాలుగా ఏప్రిల్, ఆగస్టు నెలల్లో విక్రయించాడు. దీంతో మస్క్ వ్యక్తిగత సంపద విలువ తగ్గుతూ వస్తోంది. ఇక తాజా ప్రపంచ కుబేరుడు బెర్నార్డ్ చాలా కాలంగా ప్రపంచ కుబేరుల జాబితాలో కొనసాగుతున్నారు. ఇతర బిలియనీర్ల తరహాలో బెర్నార్డ్ సంపద విలువలో ఒక్కసారిగా పెరగడం, తగ్గడం జరగదు. ఈయన సంపద విలువ క్రమానుగతంగా పెరుగుతుందని విశ్లేషకులు అంచనా. వడ్డీ రేట్ల కారణంగా మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ వంటి బిలియనీర్ల సంపద విలువ తగ్గడంతో అనూహ్యంగా బెర్నార్డ్ అగ్రస్థానానికి చేరుకున్నారు.
ఎవరీ బెర్నార్డ్ ఆర్నాల్ట్..?
- బెర్నార్డ్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువుల బ్రాండ్కి పెట్టింది పేరైన ఎల్వీఎంహెచ్ కంపెనీకి ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలో చాలా వరకు లగ్జరీ వస్తువుల బ్రాండ్లు ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి.
- ఇకోలే పాలిటెక్నిక్ నుంచి బెర్నార్డ్ ఇంజినీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం కొంతకాలం ప్రముఖ వ్యాపారవేత్త ఫెరెట్ సావినెల్ కుటుంబ వ్యాపారంలో పనిచేశారు. 1981లో అమెరికాకు మకాం మార్చారు. తండ్రికి వారసత్వంగా స్థిరాస్తి రంగంలోకి ప్రవేశించారు.
- 1984లో ఫ్రాన్స్కు తిరిగొచ్చారు. దివాలా తీసిన వస్త్ర కంపెనీ బౌశాక్ సెయింట్-ఫ్రెరేస్ను కొనుగోలు చేశారు. ఇది క్రిస్టియన్ డయోర్ అనే బ్రాండ్ పేరిట ఫ్యాషన్ వస్తువులను విక్రయిస్తుండేది. అనంతరం ఇతర గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వచ్చిన లాభాల ద్వారా ఎల్వీఎంహెచ్లో నియంత్రిత వాటాలను కొనుగోలు చేశారు. అనంతరం దీంట్లోనే రెండు ప్రధాన కంపెనీలైన లూయిస్ విటన్, మోయెట్ హెన్నెస్సీ విలీనం అయ్యాయి.
- ఎల్వీఎంహెచ్ను బెర్నార్డ్ విలాసవంత వస్తువులకు మారుపేరుగా మార్చారు. లూయిస్ విటన్, సెఫోరా సహా మొత్తం 70 ఇతర ఫ్యాషన్ బ్రాండ్లు ఎల్వీఎంహెచ్ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. షాంపేన్, వైన్, స్పిరిట్, ఫ్యాషన్, లెదర్ వస్తువులు, చేతి గడియారాలు, ఆభరణాలు, హోటళ్లు, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య ఉత్పత్తులను ఎల్వీఎంహెచ్ విక్రయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5,500 స్టోర్లు ఉన్నాయి.
- 73 ఏళ్ల బెర్నార్డ్ సామాజిక మాధ్యమాల్లో పెద్దగా యాక్టివ్గా ఉండరు. ఆయనకు ఐదుగురు సంతానం. వీరిలో నలుగురు ఎల్వీఎంహెచ్లోనే వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఏళ్లుగా వివిధ మార్కెట్లను గమనిస్తూ సంపాదించిన అనుభవమే తన విజయానికి కారణమని బెర్నార్డ్ చెబుతుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?