Amazon prime day sale: అమెజాన్ సేల్.. ఐఫోన్, వన్ప్లస్ ఫోన్లపై డీల్స్ ఇవే..
amazon prime day sale: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ (amazon prime day sale) మరో సేల్కు సిద్ధమైంది. కేవలం ప్రైమ్ మెంబర్ల కోసం జులై 23, 24 తేదీల్లో ఈ సేల్ జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ (amazon prime day sale) మరో సేల్కు సిద్ధమైంది. కేవలం ప్రైమ్ మెంబర్ల కోసం జులై 23, 24 తేదీల్లో ప్రైమ్ డే సేల్ నిర్వహించబోతోంది. ఈ సేల్లో మొబైల్స్, ఇతర యాక్సెసరీస్పై తగ్గింపు ధరలకే విక్రయించడంతో పాటు SBI, ICICI బ్యాంకు కార్డులతో కొనుగోళ్లపై అదనంగా 10 శాతం డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ముఖ్యంగా యాపిల్, శాంసంగ్, వన్ప్లస్, షావోమీ, రియల్మీ కంపెనీలకు చెందిన కొన్ని ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అమెజాన్ ప్రకటించింది. ఆ డీల్స్పై ఓ లుక్కేయండి..
ఐఫోన్పై భారీ డిస్కౌంట్: ఐఫోన్ లేటెస్ట్ ఫోన్ 13 అమెజాన్ ప్రైమ్ డే సేల్లో భారీ డిస్కౌంట్కే లభిస్తోంది. ఈ ఫోన్ ఎమ్మార్పీ ₹79,900 ఉండగా.. ₹66,900కే ఈ సేల్లో విక్రయిస్తున్నారు. పాత ఐఫోన్ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.
వన్ప్లస్ ఫోన్లపై ఈ డీల్స్: ఈ సేల్లో ముఖ్యంగా వన్ప్లస్ బ్రాండ్కు చెందిన మూడు ఫోన్లపై డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వన్ప్లస్ నార్డ్ సీఈ2 5జీ ఫోన్ ఎమ్మార్పీ రూ.24,999 కాగా.. ఈ సేల్లో వెయ్యి రూపాయలు తక్కువకు విక్రయిస్తున్నారు. బ్యాంక్ ఆఫర్తో కొనుగోలు చేస్తే ₹22,499కే ఫోన్ దక్కించుకోవచ్చు. వన్ప్లస్ సీఈ2 లైట్ ఫోన్ను సైతం ఈ సేల్లో 19,999కి లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్తో ₹17,499కే సొంతం చేసుకోవచ్చు. కొత్తగా లాంఛ్ అయిన వన్ప్లస్ నార్డ్ 2టీ వాస్తవ ధర ₹28,999.. ప్రైమ్ సేల్లో ₹27,499కే విక్రయిస్తున్నారు.
నార్జో 50ఏపై భారీ తగ్గింపు: రియల్మీ నార్జో 50ఏ ఫోన్పై ఈ సేల్లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ రిటైల్ ధర ₹ 11,499 కాగా.. ఈ సేల్లో ₹8,999కే (బ్యాంక్ ఆఫర్ కలుపుకొని) అమ్ముతున్నారు.
బడ్జెట్లో బెస్ట్ మొబైల్ ఇదే: బడ్జెట్లో మంచి ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ సేల్లో రెడ్మీ నోట్ 11పై ఓ లుక్ వేయొచ్చు. 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 33w ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, సూపర్ ఆమోలెడ్ డిస్ప్లేతో వస్తున్న ఈ మొబైల్ను ప్రస్తుతం ₹13,499కి విక్రయిస్తున్నారు. ఈ సేల్లో బ్యాంక్ ఆఫర్లు కలుపుకొని దీన్ని కేవలం ₹10,749కే సొంతం చేసుకోవచ్చు.
ఈ ఫోన్లపైనా ఓ లుక్కేయొచ్చు
- బడ్జెట్లో 5జీ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్న వారు ఐకూ జడ్6 5జీ ఫోన్పై ఓ లుక్కేయొచ్చు. ఈ ఫోన్ రూ.15,499కి విక్రయిస్తుండగా.. సేల్ సమయంలో రూ.12,999కే లభించనుంది. అలాగే శాంసంగ్ ఎం 13పై ఈ సేల్లో ₹2వేలు డిస్కౌంట్ లభిస్తోంది. ₹9999కే దీన్ని కొనుగోలు చేయొచ్చు.
- శాంసంగ్ బ్రాండ్ను ఇష్టపడే వారు ఎం33 5జీ ఫోన్ను ఈ సేల్లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. రిటైల్ ధర ₹18,999 కాగా.. ఈ సేల్లో ₹15,499కే కొనుగోలు చేయొచ్చు.
- వీటితో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇయర్ ఫోన్స్, టీవీలు తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి. ఈ సేల్లో పాల్గొనాలంటే మీరు ప్రైమ్ మెంబర్ అయ్యి ఉండాలి. ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్ కాకుంటే నెల, మూడు నెలలు, ఏడాది ప్లాన్లు తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ప్రైమ్ మెంబర్ కాకపోయి ఉంటే అమెజాన్ ఫ్రీ ట్రయల్ను ఆఫర్ సమయంలో వినియోగించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా