డౌన్లోడ్కు BGMI రెడీ.. ఆడేందుకు ఇకపై టైమ్ లిమిట్
BGMI Relaunched in India: బీజీఎంఐ దేశంలోకి రీఎంట్రీ ఇచ్చింది. డౌన్లోడ్కు అందుబాటులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మల్టీ ప్లేయర్ షూటింగ్ గేమ్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) భారత్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (iOS) స్మార్ట్ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇకపై యూజర్లు గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ల నుంచి ఈ గేమ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాదాపు ఏడాది తర్వాత గేమింగ్ లవర్స్కి అందుబాటులోకి వచ్చిన ఈ గేమ్లో.. సదరు గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ కొన్ని మార్పుల చేసింది. ఆడేందుకు టైమ్ లిమిట్ పెట్టింది.
బీజీఎంఐను ఇంతకుముందులా ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు ఆడడానికి వీల్లేదు. 18 ఏళ్ల వయసులోపు వారు ఇకపై రోజులో మూడు గంటలు మాత్రమే ఆడేందుకు వీలుపడుతుందని క్రాఫ్టన్ తెలిపింది. 18 ఏళ్లు పైబడిన వారు గరిష్ఠంగా ఆరు గంటల పాటు గేమ్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు 18 ఏళ్లలోపు వయసు గేమర్స్కు పేరెంటల్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది. అలాగే, ఒకవేళ గేమ్ డౌన్లోడ్ చేసుకున్నా అందరికీ ఒకేసారి అందుబాటులోకి రాకపోవచ్చని క్రాఫ్టన్ తెలిపింది. రానున్న 48 గంటల్లో దశలవారీగా యూజర్లకు గేమ్ అడేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది.
పబ్జీ తర్వాత అంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ గేమ్.. గతేడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గేమ్ కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతానికి మూడు నెలల ట్రయల్కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. గేమింగ్ కంపెనీ సర్వర్ లొకేషన్లు, డేటా భద్రతకు సంబంధించి నిబంధనలు పాటించినందున మూడు నెలల ట్రయల్కు మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. యూజర్లపై ప్రభావం, ఎడిక్షన్ వంటి అంశాలను పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే బీజీఎంఐని అందుబాటులోకి తెచ్చిన క్రాఫ్టన్ సంస్థ.. దీనికి ఆడేందుకు టైమ్ లిమిట్ తీసుకొచ్చింది. అలాగే, గేమ్కు సంబంధించి మ్యాపులు, వెపన్స్లో కొన్ని మార్పులు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాపిల్ WWDC 2024 తేదీలు వచ్చేశాయ్..
WWDC 2024: యాపిల్ ఏటా నిర్వహించే వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ తేదీలను ప్రకటించింది. -
‘ఎక్స్’ ప్రీమియంలో కొత్త ఫీచర్.. ఏఐ చాట్బాట్ ‘గ్రోక్’కు యాక్సెస్
Social Media X: ఎక్స్ ప్రీమియం సబ్స్క్రైబర్ల కోసం ఎలాన్ మస్క్ మరో కొత్త ఫీచర్ను అందిస్తున్నారు. -
పోకో నుంచి ఎంట్రీ లెవల్ ఫోన్.. ఫీచర్లు ఇవే..
Poco C61: పోకో తన ‘‘సీ’’ సిరీస్లో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. మార్చి 28 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయని పేర్కొంది. -
లెనోవో నుంచి కొత్త ట్యాబ్.. ఫీచర్లు ఇవిగో..!
లెనోవో కంపెనీ కొత్త ట్యాబ్ను లాంచ్ చేసింది. దీని ధరను రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది. -
Airtel: ఏడాది వ్యాలిడిటీతో ఎయిర్టెల్ ప్లాన్లు ఇవే..
Airtel: ఎయిర్టెల్ త్వరలో టారిఫ్లను పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది వ్యాలిడిటీతో ఈ టెలికాం సంస్థ అందిస్తున్న ప్లాన్లు ఏంటో చూద్దాం. ప్లాన్ల ధరలు పెరగక ముందే వీటితో రీఛార్జ్ చేసుకుంటే ఎంతో కొంత ఆదా అయ్యే అవకాశం ఉంది. -
టిక్టాక్పై నిషేధం ముప్పు.. అమెరికాలో బైట్ డ్యాన్స్ ‘కొత్త’ ప్లాన్!
టిక్టాక్పై నిషేధం ముప్పు పొంచి ఉన్న వేళ.. దాని మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ కొత్త స్కెచ్ వేసింది. కొత్త యాప్ను విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. -
Snapchat: హోలీ వేళ స్నాప్చాట్ పిచికారీ లెన్స్.. ఎలా పనిచేస్తుందంటే?
Snapchat: సందర్భానుసారంగా ఎప్పటికప్పుడు కొత్త లెన్స్లను తీసుకొచ్చే స్నాప్చాట్ తాజాగా హోలీ నేపథ్యంలో ఏఆర్ పిచికారీ అనే లెన్స్ను ప్రవేశపెట్టింది. -
Samsung: ఏఐ టూల్స్తో శాంసంగ్ కొత్త ల్యాప్టాప్
Samsung Laptop: ఫొటో రీమాస్టరింగ్, వీడియో ఎడిటింగ్ లాంటి ఏఐ టూల్స్తో శాంసంగ్ కొత్త ల్యాప్టాప్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి. -
Lava O2: బడ్జెట్ ధరలో లావా కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే
Lava O2: లావా బడ్జెట్ ధరలో కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. మార్చి 27 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయని కంపెనీ పేర్కొంది. -
Airtel: ఎయిర్టెల్ కొత్త ఆఫర్.. ఎమర్జెన్సీలో వ్యాలిడిటీ లోన్!
Airtel Validity Loan: ఇప్పటివరకు డేటాను మాత్రమే అప్పుగా ఇచ్చిన ఎయిర్టెల్ ఇకపై వ్యాలిడిటీని కూడా లోన్గా ఇవ్వనుంది. ప్లాన్ గడువు ముగిసిన వెంటనే రీఛార్జ్ చేసుకోలేని వారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది. -
Reliance Jio: ఐపీఎల్ వేళ జియో కొత్త ప్లాన్.. రూ.49తో 25జీబీ డేటా
Reliance Jio: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త డేటా ప్లాన్ తీసుకొచ్చింది. -
WhatsApp: వాట్సప్ పిన్ ఫీచర్ మరింత మెరుగ్గా.. ఇకపై 3 మెసేజ్ల వరకు
WhatsApp: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందించే వాట్సప్ తాజాగా మరో అప్డేట్తో ముందుకొచ్చింది. పిన్ ఫీచర్ను మరింత మెరుగుపర్చినట్లు వెల్లడించింది. -
Ai pin: స్మార్ట్ డివైజ్తో మీ పనులు ఈజీ.. ఇక ఫోన్ అక్కర్లేదేమో!
Humane Ai Pin: హ్యూమన్ ఏఐ పిన్.. స్మార్ట్ఫోన్కు సవాలు విసురుతోంది. ఫోన్ చేయగలిగే అన్ని పనులూ చేసేస్తూ ఔరా అనిపిస్తోంది. -
Whatsapp: వాట్సప్ కొత్త ఫీచర్.. త్వరలో టెక్ట్స్ రూపంలోకి వాయిస్ మెసేజ్!
Whatsapp: వాట్సప్ వాయిస్ సందేశాలను కొన్ని సందర్భాల్లో వినలేం. దీనికి పరిష్కారంగా దాన్ని టెక్ట్స్ రూపంలోకి మార్చుకునేలా వాట్సప్ కొత్త ఫీచర్ను సిద్ధం చేస్తోంది. -
OnePlus 12R: వన్ప్లస్ 12ఆర్లో కొత్త వేరియంట్.. ధర, ఫీచర్లివే..!
OnePlus 12R: జనవరిలో విడుదలైన వన్ప్లస్ 12ఆర్లో తాజాగా మరో కొత్త వేరియంట్ వచ్చింది. దాని ఫీచర్లు, ధర వివరాలను చూద్దాం..! -
Vivo T3: వివో కొత్త ఫోన్.. T3 5జీ స్పెసిఫికేషన్స్ ఇవే!
Vivo T3: వివో టీ3 పేరిట కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభం అవుతుంది. మార్చి 27 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. -
AI జనరేటెడ్ వీడియోలు గుర్తించడం ఇకపై సులువు.. యూట్యూబ్ కొత్త రూల్స్
YouTube: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. వీటి సాయంతో యూజర్లు సులభంగా ఏఐ కంటెంట్, వాస్తవిక వీడియోల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది. -
Jio AirFiber: ఎయిర్ఫైబర్ యూజర్లకు జియో ఆఫర్.. ఫ్రీగా ట్రిపుల్ డేటా స్పీడ్
Jio AirFiber data offer: ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్న వేళ ఎయిర్ ఫైబర్ యూజర్లకు జియో ఆఫర్ ప్రకటించింది. అధిక డేటా స్పీడ్ను ఆఫర్ చేస్తోంది. -
WhatsApp: త్వరలో వాట్సప్ స్టేటస్లో నిమిషం వీడియో!
WhatsApp: వాట్సప్లో ప్రస్తుతానికి 30 సెకన్ల వీడియోను మాత్రమే అప్లోడ్ చేయగలం. సుదీర్ఘ నిడివి గల వీడియోలను సైతం పోస్ట్ చేసేందుకు త్వరలో ఈ సామాజిక మాధ్యమం అవకాశం ఇవ్వనుంది. -
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్తో నాయిస్ జట్టు.. స్మార్ట్వాచ్తోనే పేమెంట్స్
Smart Watch: ఎయిర్టెల్ పేమెంట్స్, మాస్టర్కార్డ్తో కలసి నాయిస్ కొత్త స్మార్ట్వాచ్ను లాంచ్ చేసింది. డిజిటల్ లావాదేవీలను మరింత సులభతరం చేయడం కోసం దీన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. -
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
Vodafone Idea: డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్