Banking Crisis: మరో సంక్షోభం రాకుండా.. అమెరికన్ బ్యాంకులన్నీ ఏకతాటిపైకి!
Banking Crisis: పతనం అంచుల్లో ఉన్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ను ఆదుకునేందుకు అమెరికాలోని 11 బడా బ్యాంకులు 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాయి. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
న్యూయార్క్: సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనం అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ (American banking system)ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అక్కడ మరికొన్ని బ్యాంకులూ అదే బాటలో ఉన్నాయనే వార్తలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారింది. ఐరోపాలో క్రెడిట్ సూయిజ్ కూడా ఇదే తరుణంలో ప్రమాద ఘంటికలు మోగించడంతో ఆందోళన తీవ్రమైంది. మరోసారి 2008 నాటి లేమన్ బ్రదర్స్ స్థాయి సంక్షోభం తలెత్తుతుందోననే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికాలోని 11 బడా బ్యాంకులు ఏకతాటిపైకి వచ్చాయి. మరో భారీ సంక్షోభం రాకుండా ఉమ్మడి చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు పతనం అంచుల్లో ఉన్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ను ఆదుకునేందుకు 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాయి. ఈ బ్యాంకులో కూడా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తరహాలో టెక్, అంకుర సంస్థల డిపాజిట్లే అధికంగా ఉన్నాయి. డిసెంబరు 31 నాటికి ఈ బ్యాంకులో 176.4 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. అయితే, బ్యాంకింగ్ వ్యవస్థపై వస్తున్న వదంతులతో ఖాతాదారులు ఇటీవల భారీ ఎత్తున నగదును ఉపసంహరించుకుంటున్నారు. దీంతో ద్రవ్య లభ్యత సమస్య ఏర్పడి దివాలా తీయొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులన్నీ ఏకమై ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి.
2008 ఆర్థిక సంక్షోభం ఆరంభంలోనూ బ్యాంకులు ఇలాగే ఏకతాటిపైకి వచ్చి బలహీనంగా ఉన్న బ్యాంకులను ఆదుకునేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని బడా బ్యాంకులు ఇతర బ్యాంకులను కొనుగోలు చేసి సంక్షోభం మరింత ముదరకుండా చర్యలు తీసుకున్నాయి. కానీ, అప్పటికే పరిస్థితి చేదాటడంతో సంక్షోభం అనివార్యమైంది.
ఫస్ట్ రిపబ్లిక్లో అనేక మంది బిలియనీర్లు ఖాతాదారులుగా ఉన్నట్లు సమాచారం. వారందరికీ ఈ బ్యాంకు సులభమైన షరతులతో సేవలందిస్తోన్నట్లు తెలుస్తోంది. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ సైతం ఈ బ్యాంకులో తనఖా రుణం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. బ్యాంకు షేరు గురువారం ఓ దశలో 36 శాతం నష్టపోయింది. కానీ, 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటన నేపథ్యంలో తిరిగి పుంజుకుంది. చివరకు 10 శాతం లాభంతో ముగిసింది
ఫస్ట్ రిపబ్లిక్కు నిధులు సమకూరుస్తున్న వాటిలో జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, వెల్స్ ఫార్గో, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మన్ శాక్స్, బీఎన్వై మెలన్, స్టేట్ స్ట్రీట్, పీఎన్సీ బ్యాంక్, ట్రుయిస్ట్, యూఎస్ బ్యాంక్ ఉన్నాయి. ఇవన్నీ ఒకే వేదిక మీదరకు రావడం.. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉందో సూచిస్తోందని సంయుక్త ప్రకటనలో ఆయా బ్యాంకులు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203