Rakesh Jhunjhunwala: దిగ్గజ ఇన్వెస్టర్.. ఝున్ఝున్వాలా చెప్పిన విజయసూత్రాలివే!
స్టాక్ మార్కెట్లో విజయవంతంగా కొనసాగేందుకు రాకేశ్ ఝున్ఝున్వాలా (Rakesh Jhunjhunwala) పలు సందర్భాల్లో చెప్పిన విజయ సూత్రాలను ఓసారి చూద్దాం.
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్ఝున్వాలా (Rakesh Jhunjhunwala) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ప్రారంభంలో రూ.5వేలతో వ్యాపారం మొదలుపెట్టిన ఆయన.. ప్రస్తుతం రూ.40వేల కోట్ల సంపదను సమకూర్చుకున్నారు. అందుకే స్టాక్ మార్కెట్లో మదుపుచేసే వారికి, కలల్ని నిజం చేసుకోవాలనుకునే వారికి ఆయన ఆదర్శంగా నిలిచారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ముందుకు పయనించేందుకు పలు సందర్భాల్లో ఆయన చెప్పిన విజయ సూత్రాలను ఓసారి చూద్దాం.
- విజయవంతమైన మదుపరిగా ఎదగాలంటే మొదట కొన్ని తప్పులు చేసి వాటి నుంచి నేర్చుకోవాలి.
- మార్కెట్లే సుప్రీం అని నమ్మనంతకాలం.. మీరు తప్పు చేశారు అనే విషయాన్ని ఒప్పుకోలేరు. ఇలా మీ తప్పును ఒప్పుకోకపోతే.. మీరు ఎన్నటికీ నేర్చుకోలేరు. స్టాక్ మార్కెట్లో విజయవంతం కావాలంటే తప్పుల నుంచి నేర్చుకునే సామర్థ్యం ఉండాలి. కానీ, అందుకు తనది మాత్రమే (స్వీయ) బాధ్యత అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- కంపెనీల ప్రమోటర్లను నేను ఎన్నడూ నిందించను. నాకు నేను మాత్రమే నిందించుకుంటాను. ప్రమోటర్ ఆయన కోణంలో ఆయన ఆలోచిస్తారు. అనుకున్న స్థాయిలో ఆ వ్యక్తి ఉన్నాడా లేదా అనే విషయాన్ని మనమే గుర్తించాలి.
- విజయానికి షార్ట్కర్ట్లు లేవు. విజయవంతమైన మదుపరిగా మారాలంటే ఎప్పటికప్పుడు మార్కెట్పైన పూర్తి అవగాహనతో ఉండాలి.
- ఇలా భారీ లాభాలను పొందే క్రమంలో పేదలకు ఆపన్నహస్తం అందించాలని ఝున్ఝున్వాలా భావిస్తుండేవారు. ఇందుకోసం ఓ ట్రస్టుని కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఇలా చేస్తే ఏదో మంచి ఫలితాలు వస్తాయనే ఆలోచనతో మాత్రం అలా చేయవద్దంటారు ఈ దిగ్గజ స్టాక్ బ్రోకర్.
- స్టాక్మార్కెట్పై ఝున్ఝున్వాలాకు ఉన్న అవగాహన, పెట్టుబడులపై అపరిమిత పరిజ్ఞానం ఆయన వాటాదారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ఝున్ఝున్వాలా చెప్పిన మరికొన్ని సూక్తులు..
- స్థిరమైన మనస్తత్వం లేకుండా మీరు విజయం సాధించలేరు
- మార్కెట్లు మహిళల వంటివి. ఎల్లప్పుడూ గంభీరంగా, మిస్టరీగా, ఊహించని విధంగా, చంచలంగానూ ఉంటాయి.
- పోరాట స్ఫూర్తిని అలవరచుకోండి. చెడును కూడా మంచిగా భావించండి.
- నష్టాలకు ముందుగానే సిద్ధమై ఉండండి. ఇన్వెస్టర్ల జీవితాల్లో నష్టాలనేవి భాగం.
- ఎల్లప్పుడు అలలకు ఎదురీదండి. ఇతరులు అమ్ముతున్నప్పుడు కొనండి. అదే సమయంలో ఇతరులు కొంటున్నప్పుడు షేర్లు అమ్మేయండి.
- అవకాశాలు టెక్నాలజీ రూపంలోనో, మార్కెటింగ్, బ్రాండ్లు, క్యాపిటల్ రూపంలోనో వస్తుంటాయి. అటువంటి వాటిని వెంటనే గుర్తించే స్థానంలో ఉండాలి.
- ప్రపంచాన్ని నీ కోణంలో చూడడం కంటే వాస్తవంగా ఎలా ఉందో అలానే చూడు.
- నష్టాలను ఎదుర్కొని.. తప్పుల నుంచి నేర్చుకోండి.
- అనవసరపు అంచనాలతో పెట్టుబడి పెట్టకండి. పేరొందిన కంపెనీల జోలికి ఎన్నడూ వెళ్లకండి.
- ఈపీఎస్ను (Earnings per share) అంచనా వేయడం శాస్త్రీయతతో కూడుకున్నది. అందులో ‘ఆర్ట్’ పాత్ర స్వల్పమే. అదే పీఈఆర్ (Price to Earnings Ratio) విషయానికొస్తే పూర్తిగా నైపుణ్యంతో కూడుకున్నది. ఇది వంట, శృంగారం వంటిది. వీటిని ఎవరూ బోధించరు, మనమే నేర్చుకోవాలి. విజయవంతమైన పెట్టుబడుల్లో పీఈఆర్లను అర్థం చేసుకోవడం, అంచనా వేయడమే అత్యంత కీలకమైన అంశం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు