MCLR: రుణ వడ్డీ రేట్లను పెంచిన బీఓబీ, యూబీఐ

ఈ బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచడంతో రుణాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.

Updated : 11 Nov 2022 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణ వడ్డీ రేట్లను (ఎంసీఎల్‌ఆర్‌) పెంచాయి. 2022 మే నెలలో ఆర్‌బీఐ రెపో రేటును పెంచడం ప్రారంభించినప్పటి నుంచి బ్యాంకులు రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తన ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను అన్ని కాలవ్యవధులకు 10 నుంచి 15 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. బ్యాంకు ఒక సంవత్సరపు ఎంసీఎల్‌ఆర్‌ 7.95% నుంచి 8.05%కు పెరిగింది. ఈ కొత్త రేట్లు 2022 నవంబరు 12 నుంచి అమల్లోకి వస్తాయి. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అన్ని కాలవ్యవధులకు ఎంసీఎల్‌ఆర్‌ను 30 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ పెంపుతో ఎంసీఎల్‌ఆర్‌ 7.15% నుంచి 7.45%కు పెరిగింది. బ్యాంకు వెబ్‌సైట్‌ ప్రకారం సవరించిన వడ్డీ రేట్లు 2022 నవంబరు 11 నుంచి 2022 డిసెంబరు 10 వరకు అమల్లో ఉంటాయి. రుణగ్రహీతలు ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లతో గృహ రుణాలు తీసుకున్నట్లయితే వారి ఈఎంఐలలో పెరుగుదల కనిపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని