స్టార్టప్ల వెనుక మన స్టార్లు.. బాలీవుడ్ స్టార్ల పెట్టుబడులు వీటిలోనే..
Bollywood stars behind startups: బాలీవుడ్కు చెందిన పలువురు స్టార్లు అటు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది సినీ తారలు ఎప్పటి నుంచో అనుసరిస్తున్న సూత్రం. అందుకే ఫేమ్ కొనసాగినంత కాలం వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీబిజీగా కాలాన్ని గడిపేస్తుంటారు. వెండితెరపై విభిన్న పాత్రలతో సందడి చేస్తుంటారు. ఇప్పటి తారలు మరో ముందడుగు వేసి తమలోని వ్యాపారవేత్తను సైతం బయటకు తీస్తున్నారు. తాము సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని స్టార్టప్ (startups) కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. తమ పెట్టుబడుల ద్వారా లాభాలు ఆర్జించడమే కాకుండా తమ పెట్టుబడుల ద్వారా ఆ స్టార్టప్లకూ గుర్తింపు తీసుకొస్తున్నారు. వాటి విజయంలో కీలక భూమిక పోషిస్తున్నారు. కథానాయకులు, నాయికలు అన్న భేదం లేకుండా ముందుకెళ్తున్నారు. అలా స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కొందరు బాలీవుడ్కు సినీ తారలు (Bollywood stars) గురించి ఇప్పుడు చూద్దాం..
- అలియా: ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా తెలుగు ప్రజలకు చేరువైన అలియా భట్ స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో ముందందనే చెప్పాలి. పలు కంపెనీల్లో ఆలియా పెట్టుబడులు ఉన్నాయి. ఆలయాల్లో పూల వ్యర్థాలతో అగరబత్తీలు, దూప్స్టిక్లను తయారు చేసే ఫూల్.కో (Phool.co)లో ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి. వీటితో పాటు స్టైల్ క్రాకర్ (StyleCraker) ఆన్లైన్ దుస్తుల ప్లాట్ఫాంతో పాటు నైకాలోనూ అలియాకు పెట్టుబడులు ఉన్నాయి. Ed-a-Mamma పేరిట చిన్నపిల్లల దుస్తుల ప్లాట్ఫామ్నూ అలియా నిర్వహిస్తోంది.
- అనుష్క శర్మ: విరాట్ కోహ్లీ భార్యగా, బాలీవుడ్ నటిగా అనుష్క శర్మ అందరికీ సుపరిచితమే. మిల్లెట్స్తో తయారుచేసే ఫుడ్ బ్రాండ్ స్లర్ప్ ఫామ్ (Slurrp Farm)లో అనుష్కకు పెట్టుబడులు ఉన్నాయి. వీటితో పాటు డిజిట్ ఇన్సురెన్స్ కంపెనీ, బ్లూ ట్రైబ్ అనే మీట్ కంపెనీలోనూ ఆమెకు వాటాలున్నాయి.
- ప్రియాంక చోప్రా: హాలీవుడ్ స్థాయిలో పేరు తెచ్చుకున్న మరో నటి ప్రియాంక చోప్రా. బంబుల్ (Bumble) అనే డేటింగ్, సోషల్ మీడియా యాప్లో ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి. అలాగే అపార్ట్మెంట్ లిస్ట్ అనే అమెరికా రెంటల్ మార్కెట్ వ్యాపారంలోనూ ప్రియాంక చోప్రా పెట్టుబడులు పెట్టారు.
- దీపిక పదుకొణె: బాలీవుడ్ నటి, రణ్వీర్ సింగ్ భార్య దీపికా పదుకొణె సైతం పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు బాగా పాపులర్ అయిన మింత్రాను నెలకొల్పిన వారిలో దీపిక సైతం ఉన్నారు. ఆ తర్వాత దాన్ని వాల్మార్ట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపిక కేఏ ఎంటర్ప్రైజస్ ఎల్ఎల్పీ పేరిట ఓ కంపెనీ నెలకొల్పారు. దాని ద్వారా అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఎఫ్ఎంసీజీ కంపెనీ ఎపిగమియా, ఎడ్టెక్ కంపెనీ ఫ్రంట్ రో, ఎలక్ట్రిక్ ట్యాక్సీల స్టార్టప్ బ్లూస్మార్ట్, పెంపుడు జంతువుల కోసం ఉద్దేశించిన సూపర్ టెయిల్స్, స్పేస్ టెక్నాలజీకి చెందిన బెల్లాట్రిక్స్ ఎరోస్పేస్ వంటి స్టార్టప్ కంపెనీల్లో ఆమె పెట్టుబడులు ఉన్నాయి.
- సోనూసూద్: కరోనా సమయంలో ఎంతోమందికి సాయం చేసి వార్తల్లో నిలిచిన సోనూసూద్.. కె12 అనే ఎడ్యుకేషన్ కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. జితిన్ భాటియాతో కలిసి Explurger అనే సోషల్ మీడియా యాప్ను సైతం సోనూ ప్రారంభించారు.
- సునీల్ శెట్టి: మరో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సైతం కేవలం వినోద రంగానికి పరిమితం అవ్వలేదు. అనేక స్టార్టప్ కంపెనీల్లో ఆయనకూ పెట్టుబడులు ఉన్నాయి. ఎన్ఎఫ్టీ వ్యాపారంలోనూ ఉన్నారు. Colexion అనే కంపెనీలో ఆయన పెట్టుబడులు పెట్టారు. హెల్త్ టెక్ స్టార్టప్ వైరూట్స్లోనూ ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి. బాడీఫస్ట్ అనే న్యూట్రిషన్ బ్రాండ్లోనూ, అక్వాటిన్ అనే ఫిట్నెస్ బ్రాండ్లోనూ ఆయనకు వాటాలు ఉన్నాయి.
- వీరే కాకుండా సుగర్ కాస్మోటిక్స్ కంపెనీలో బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్కు, మామా ఎర్త్ కంపెనీలో శిల్పాశెట్టి కుంద్రాకు పెట్టుబడులు ఉన్నాయి. కొన్ని బ్రాండ్లకు ఆమె బ్రాండ్ అంబాసిడర్గానూ వ్యవహరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ