Microsoft India COO: జీవితం పిజ్జా లాంటిది.. ఆ ఐదూ ఉండాల్సిందే!
‘జీవితంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే!’ చాలామంది ప్రముఖులు ఆచరించే విజయసూత్రమిది.
(Photo: Instagram)
‘జీవితంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే!’ చాలామంది ప్రముఖులు ఆచరించే విజయసూత్రమిది. తన సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే అంటున్నారు మైక్రోసాఫ్ట్ ఇండియా సీఓఓగా తాజాగా నియమితురాలైన ఇరీనా ఘోస్. రెండు దశాబ్దాలుగా ఈ సంస్థలో ఎన్నో కీలక పదవులు అధిరోహించిన ఆమె.. ఓ సమాజ సేవకురాలు కూడా! చదువే అమ్మాయిల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుందంటోన్న ఇరీనా.. STEM వంటి విభాగాల్లో మహిళల ఉనికిని పెంచేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. అంతేనా.. మరోవైపు రన్నర్గానూ తన అభిలాషను నెరవేర్చుకుంటుంటారు. ‘కెరీర్ను, కుటుంబాన్ని బ్యాలన్స్ చేయడంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు.. అయినా ఆ ప్రయత్నాన్ని ఆపకూడదం’టోన్న ఈ లేడీ బాస్ జీవితంలోని ప్రతి అడుగూ మనకు ఆదర్శప్రాయమే!
‘పని పట్ల జిజ్ఞాస, ఉత్సాహం.. ఈ రెండూ ఉన్నప్పుడే చేసే పని బోర్ కొట్టదు.. మైక్రోసాఫ్ట్ ఇండియాలో పనిచేస్తోన్న క్రమంలో తాను నేర్చుకున్నది ఇదే’ అంటున్నారు ఇరీనా ఘోస్. IIT (BHU)లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివిన ఆమె.. జార్ఖండ్లోని XLRI లో ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. చదువు పూర్తయ్యాక హెచ్సీఎల్, విప్రో.. వంటి ప్రముఖ కంపెనీల్లో కొన్నేళ్ల పాటు పనిచేసిన ఇరీనా.. 2001లో మైక్రోసాఫ్ట్ ఇండియాలో చేరారు.
రెండు దశాబ్దాల అనుబంధం!
ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ ఇండియాతో ఇరీనా ఘోస్కు సుమారు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. ఈ సంస్థలో ‘రీజనల్ అలయన్స్ మేనేజర్’గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. వివిధ విభాగాల్లో, వేర్వేరు హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఇక మొన్నటిదాకా ‘క్లౌడ్ సొల్యూషన్స్’ విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలందించిన ఇరీనా.. తాజాగా ఈ కంపెనీ సీఓఓగా నియమితులయ్యారు. దీంతో ‘ఇకపై కంపెనీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ ఇరీనా ఆధ్వర్యంలోనే జరగనున్నాయం’టూ మైక్రోసాఫ్ట్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది.
‘ఈ డిజిటల్ ప్రయాణంలో ఉద్యోగులతో, వినియోగదారులతో మరింత చేరువగా పనిచేసే అవకాశం దొరికింది. ఇప్పటిదాకా నేను నేర్చుకున్న నైపుణ్యాలతో కంపెనీని మరింత అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ప్రయత్నిస్తాను. అలాగే సరికొత్త నైపుణ్యాలతో కూడిన వేదికలను యువతకు అందించేందుకు కృషి చేస్తా. కంపెనీతో ఇన్నేళ్ల నా ప్రయాణంలో పని పట్ల ఉత్సాహం, జిజ్ఞాస ఎలా చూపాలో నేర్చుకున్నా.. ఇదే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది..’ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఇరీనా.
సమాజానికి తన వంతుగా..!
మనం మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సమాజ సేవ కోసం కాస్త సమయం కేటాయించాలంటారు ఇరీనా. ఈ క్రమంలోనే తాను ఓవైపు కెరీర్లో కొనసాగుతూనే.. మరోవైపు 2010లో ‘మై లిటిల్ బిట్’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. నిరుపేద అమ్మాయిలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిభ ఉన్న అమ్మాయిలకు స్కాలర్షిప్స్ అందిస్తూ వారిని ఉన్నత విద్య దిశగా ప్రోత్సహిస్తున్నారు. అలాగే వారికి STEM, నైపుణ్యాభివృద్ధి కోర్సులు నేర్పిస్తున్నారు.
‘నేను విద్యావేత్తల కుటుంబం నుంచి వచ్చాను. కాబట్టి చదువు విలువేంటో నాకు తెలుసు. నేను పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎంతోమంది అమ్మాయిలు వివిధ కారణాల రీత్యా చదువుకు దూరమవడం గమనించా. ఎలాగైనా ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనుకున్నా. అందుకే ‘మై లిటిల్ బిట్’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించా. చదువే అమ్మాయిలకు ఈ సమాజంలో ఓ విలువ, గౌరవం అందిస్తుంది..’ అంటారు ఇరీనా.
జీవితం పిజ్జా లాంటిది..!
కెరీర్, కుటుంబం, సమాజ సేవతో ఎప్పుడూ బిజీగా ఉన్నా తన అభిరుచుల పైనా దృష్టి సారిస్తుంటారీ లేడీ బాస్. ఈ క్రమంలో తనకు ఇష్టమైన పరుగును ఆస్వాదిస్తూ.. అప్పుడప్పుడూ పలు మారథాన్లలోనూ పాల్గొంటుంటానని చెబుతున్నారామె. అంతేకాదు.. ఆమె ఓ మ్యూజిక్ లవర్ కూడా! ‘నేను స్వతహాగా రన్నర్ని. పరుగు మనలో పట్టుదలను పెంచుతుంది. మనల్ని ఫిట్గా, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వారిలా మార్చుతుంది. చాలామంది పరుగును ఓ క్రీడగానే భావిస్తారు. కానీ దీనిలా వేగంగా, పరిణతితో కూడిన నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో ఎదగగలం. వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉండే వారు ఇంటిని-పనిని బ్యాలన్స్ చేయలేరనుకుంటారు. కానీ బ్యాలన్స్ విషయంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు.. అలాగని దాన్ని వదిలిపెట్టకుండా ప్రయత్నించే పట్టుదల కావాలి. అందుకే పిజ్జాలోని లేయర్లలా.. కుటుంబం, పని, స్నేహితులు, స్వీయ ప్రేమ, సమాజానికి మన వంతుగా తిరిగివ్వడం.. వీటన్నింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇదే అసలైన జీవితం!’ అంటూ తన సక్సెస్ సీక్రెట్ గురించి పంచుకున్నారీ టెకీ బాస్.
2016 నుంచి ‘Sonder Connect’ సంస్థ ట్రస్టీగా కొనసాగుతోన్న ఇరీనా.. ఈ వేదికగా దేశంలోని మహిళలు నాయకత్వం వహిస్తోన్న స్టార్టప్లకు ఊతమిస్తున్నారు. విధి నిర్వహణలో ఆమె చూపిన చొరవ, సేవలకు గుర్తింపుగా.. 2017లో మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి ‘ఇన్స్పిరేషనల్ వుమన్’ అవార్డ్ అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి కోసం సిద్ధం ఇలా
సొంతిల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నారా? మీ దగ్గర ఎంత డబ్బుంది? గృహరుణం ఎంత తీసుకోవాలి? ఇలాంటి లెక్కలన్నీ వేసుకున్నారా? ఈ సమయంలో తీసుకునే చిన్న జాగ్రత్తలతోనే లక్షల రూపాయలు ఆదా చేసుకునేందుకు మార్గం దొరుకుతుంది -
ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీపై పన్ను పడకుండా...
బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? ఆదాయపు పన్ను పరిధిలో లేనప్పుడు మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) పడకుండా చూసుకుంటున్నారా? ఇందుకోసం ఏం చేయాలో తెలుసా? బ్యాంకు లేదా సంస్థల దగ్గర ఫారం 15జీ లేదా 15హెచ్ను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మూలం వద్ద పన్ను కోత విధించరు. -
జీవిత బీమా.. మీ బాధ్యతలను తీర్చేలా
మీ నెలవారీ ఆదాయం కిరాణా సామగ్రి, బిల్లులు చెల్లించడం, పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులను తీర్చడంలో మీకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకుంటుంది. మీ బడ్జెట్ ఖర్చులను పక్కన పెడితే.. మీ నెలవారీ ఆదాయంలో కొంత భాగాన్ని ఆరోగ్య అత్యవసర ఖర్చులు, పదవీ విరమణ ప్రణాళికలు, పిల్లల ఉన్నత విద్యలాంటి వాటి కోసం పొదుపు, మదుపు చేయాల్సిన అవసరమూ ఉంటుంది. -
బేరమాడితే తగ్గేను ప్రీమియం
కారు బీమా ఒక బాధ్యత. ఏడాదికోసారి దీన్ని పునరుద్ధరిస్తూనే ఉండాలి. అప్పుడే దీన్ని మీరు రోడ్డు మీద ఎలాంటి భయాలూ లేకుండా నడపగలరు. బీమా రక్షణ లేకుంటే.. అటు చట్టపరంగానూ, ఇటు ఆర్థికంగానూ చిక్కులు తప్పవు. -
నిఫ్టీ 50 షేర్లలో పెట్టుబడికి...
నవి మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక నిఫ్టీ 50 ఈటీఎఫ్ పథకాన్ని తీసుకొచ్చింది. నవీ నిఫ్టీ 50 ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ నేటితో ముగియనుంది. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.250. ఓపెన్ ఎండెడ్ పథకం. -
Elon Musk: బాల్యంలో కష్టాలు పడ్డా.. వదంతులకు చెక్ పెడుతూ మస్క్ పోస్ట్
Elon Musk: ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా అనేక విషయాలను పంచుకుంటుంటారు. అనేక మంది ట్వీట్లకు తన దైన శైలిలో స్పందిస్తుంటారు. ఇటీవల గనులపై వస్తున్న ఆరోపణలపై మరోసారి సుదీర్ఘ ట్వీట్ చేశారు. -
Mukesh Ambani: ముకేశ్ అంబానీ.. 20 ఏళ్ల ఇండస్ట్రీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ విస్తరణలో ముకేశ్ అంబానీ కీలక పాత్ర పోషించారు. తండ్రి మరణం తర్వాత కంపెనీ బాధ్యతలు చేపట్టిన ఆయన సంస్థను అనేక రంగాలకు విస్తరించారు. -
Retirement: 50 ఏళ్లకే రిటైర్.. తర్వాత ఎలా? నితిన్ కామత్ సూచనలు
ఒకప్పటిలాగా 60 ఏళ్లు పనిచేసి, పదవీ విరమణ చేసే రోజులు కావివి. ఆధునిక యువత 50 ఏళ్లకే ఉద్యోగం మానేసి, తమకు నచ్చినట్లుగా జీవించేందుకు సిద్ధం అవుతున్నారు. వైద్యపరమైన పురోగతి కారణంగా ఆయుర్దాయం 80కి చేరింది. -
Nellore: చదువు మానేసి.. చాయ్తో రూ.5 కోట్లు
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన ఆ యువకుడు.. ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజ యూనివర్సిటీలో బీబీఏ (బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) చదివి.. మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో విమానం ఎక్కాడు. -
లక్ష కోట్లకు చేర్చిన ఉక్కు మహిళ!
తక్కువమంది ఎంచుకునే రంగంలో అడుగుపెట్టడానికి సంకోచించేవారే ఎక్కువ. అమ్మాయిలను చదివించడమే గొప్పనుకునే రోజుల్లో ఆ సాహసం చేశారు సోమ మోండల్. ఓ మహిళ.. నాయకురాలన్న ఊహే కష్టమైన వేళ ఆ స్థానాన్ని అధిరోహించారు. -
Zepto: చిటికేసి... వేల కోట్లు సృష్టించిన చిన్నోళ్లు!
ఇంకా వయసు 20 దాటలేదు... చదువు పూర్తి కాలేదు....అలాంటి వారు... అప్పటికే మార్కెట్లో 20 ఏళ్ల అనుభవమున్నవారిని ఇంటర్వ్యూ చేస్తుంటే వచ్చిన వారికి అనుమానం! ఈ కుర్రాళ్లా మా సామర్థ్యాన్ని నిర్ణయించేదని? వీళ్లా మాకు కొలువిచ్చేదని? ఆ -
Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఓ అధ్యాయం ముగిసింది. భారత్లో ఈక్విటీ మదుపర్లకు బెంచ్మార్క్గా చెప్పుకునే రాకేశ్ ఝున్ఝున్వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. -
Savitri Jindal: ఆసియా సంపన్న మహిళ.. సావిత్రి జిందాల్
ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా భారత్కు చెందిన సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. జిందాల్ గ్రూప్ ఛైర్పర్సన్ అయిన ఆమె నికర సంపద 11.3 బిలియన్ -
తక్కువ నష్టానికీ వ్యూహాలు!
‘ప్రపంచమంతా అధిక ధరలతో.. ఆ ప్రభావం వల్ల ఏర్పడుతున్న మందగమనంలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో, మదుపర్లు.. ముఖ్యంగా తొలిసారి డబ్బులు పెడుతున్నవారు తక్కువగా నష్టపోయే వ్యూహాన్ని అనుసరించాల’ని స్విస్ పెట్టుబడిదారు,‘ది గ్లూమ్ బూమ్ డూమ్’ ఎడిటర్ మార్క్ ఫాబర్ సూచిస్తున్నారు. ‘అమెరికాలో వడ్డీరేట్లు అధికంగా పెంచబోరని, 6 నెలల్లో తగ్గించడం ప్రారంభం కావచ్చ’ని వార్తా సంస్థ ‘ఇన్ఫామిస్ట్’కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ముఖ్యాంశాలివీ.. -
Gita Gopinath: ‘గీత’లు చెరిపేస్తూ.. మరో ఘనత సాధించిన గీతా గోపీనాథ్..!
ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF)కి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులై రికార్డు సృష్టించారు భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్. -
దాన లక్ష్ములు!
‘నా సంపదలో సగం దానం చేస్తా’ రెండేళ్ల క్రితం మెకంజీ స్కాట్ మాట ఇది! అన్నట్టుగానే ఏటా ఆమె దానాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వచ్చారు. -
‘యూనికార్న్’ అంటే నమ్మలేకపోయా!
మహిళలు సాంకేతిక రంగంలో.. అదే విధంగా ఆర్థిక రంగంలో ఉండటం చూశాం. కానీ ఈ రెండూ కలగలసిన ఫిన్టెక్ రంగంలో మాత్రం చాలా అరుదు. -
జోడీ నెంబర్ 1
కంబైన్డ్ స్టడీతో మార్కులు కొల్లగొట్టిన విద్యార్థుల్ని చూశాం. సివిల్స్ సాధించిన భార్యాభర్తల గాథలు విన్నాం. -
ఆఫీసు బాయ్ నుంచి కోట్ల వ్యాపారం దాకా!
‘ఇది కాదు... ఇది కానే కాదు. నేను ఉండాల్సిన చోటు ఇది కాదు... నేను చేరుకోవాల్సిన గమ్యం ఇది కాదు... అందుకోవాల్సిన లక్ష్యం ఇంకా నా -
ఆ రోజు... చనిపోతాననుకున్నా!
గౌతమ్ అదానీ.. దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అంబానీతో పోటీపడుతున్న ఈ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు అధినేత.