Budget 2022 23: రియల్ ఎస్టేట్కు ‘బడ్జెట్’ బూస్ట్ ఇచ్చేనా..?
2023 నాటికి పీఎమ్ఏవై కింద 80 లక్షల ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కారణంగా దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ రంగానికి తాజా బడ్జెట్లో ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోయినప్పటికీ సరసమైన గృహాల విషయంలో కొంత ఊరట లభించింది. దేశవ్యాప్తంగా 2023 నాటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద 80 లక్షల ఇంటి నిర్మాణాలను పూర్తి చేస్తామని, ఇందుకోసం రూ.48 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు మంగళవారం తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఈ ప్రకటన దేశంలో సరసమైన గృహాల నిర్మాణాన్ని పెంచుతుందని, ఈ గృహాలను నిర్మించే రియల్ ఎస్టేట్ రంగం, డెవలపర్లకు ఊతం ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, ప్రజలకు తాగునీటిని అందించే లక్ష్యంలో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 3.80 కోట్ల గృహాలకు నీటి కోసం నల్లా కనెక్షన్ ఇవ్వాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.60 వేల కోట్లను కేటాయించారు. ఈ నిర్ణయం కూడా అందుబాటు ధరల్లో గృహాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు రోడ్ల నిర్మాణం, అనుసంధానం సైతం రియల్ ఎస్టేట్కు ఎల్లప్పుడూ సహాయపడుతుంది. దేశీయ రహదారుల నిర్మాణం కోసం 2022-23 బడ్జెట్లో కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. 25 వేల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. గ్రామీణ రహదారుల నిర్మాణానికి గ్రామీణ సడక్ యోజన కింద ఈ సారి 35 శాతం అధికంగా, రూ.19 వేల కోట్ల నిధులను కేటాయించారు.
ఈ బడ్జెట్లో ప్రభుత్వం పట్టణాభివృద్ధి, డిజటలైజేషన్, సుస్థిరత వంటి అంశాలపై దృష్టిసారించింది. దీంతో పట్టణాలు, నగరాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజల గృహ కొనుగోలు, ఖర్చుల సామర్థ్యం పెరుగుతుంది. ఇది గృహ నిర్మాణ రంగానికి సానుకూలంగా ఉంటుందని రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్