బడ్జెట్ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బడ్జెట్ సమర్పించనున్న ఈ కీలకమైన రోజు దేశంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు 11 గంటలకు 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను సమర్పించనున్నారు. ఈ కీలకమైన రోజు దేశంలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.. భారత్లో 22 కేరట్ల పసిడి ధర పది గ్రాములకు రూ.44,900 కాగా.. 24 కేరట్ల రూ.48,980 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ప్రస్తుత ధర కిలోకు రూ.60,900 ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, సోమవారం 22, 24 కేరట్ల బంగారం ధరలు వరుసగా రూ.44,900, రూ.48,990 ఉండటం గమనార్హం.
ఐతే, వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఎక్సైజు డ్యూటీ, రాష్ట్ర పన్నులు, మజూరీ తదితర అంశాలను అనుసరించి బంగారు ఆభరణాల ధరలో స్వల్ప భేదాలు ఉండవచ్చు. ఈ మేరకు దేశంలోని ఐదు ముఖ్య నగరాల్లో 22 కేరట్లు, 24 కేరట్ల బంగారం ధరలు పది గ్రాములకు గాను ఇలా ఉన్నాయి:
దిల్లీ: రూ. 44900 - రూ. 48,980
ముంబయి: రూ. 44,900 - రూ. 48,980
చెన్నై: రూ. 45,160 - రూ. 49,280
కోల్కతా: రూ. 44,900 - రూ. 49,090
హైదరాబాద్: రూ. 44,900 - రూ. 48,980
అదేవిధంగా వెండి కిలో ధర దిల్లీ, ముంబయి, కోల్కతా నగరాల్లో రూ. 60,900 ఉండగా.. చెన్నై, హైదరాబాద్ నగరాలలో మాత్రం రూ. 65,300గా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..