Budget: ఉద్యోగ కల్పనపై బడ్జెట్లో దృష్టి పెట్టాలి.. పరిశ్రమ వర్గాల సూచన
వచ్చే ఏడాది బడ్జెట్కు సంబంధించిన ముందస్తు సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి తమ సూచనలను అందజేస్తున్నాయి. ఈసారి ఉద్యోగ సృష్టిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
దిల్లీ: ఉద్యోగ కల్పన, పన్ను వసూళ్లను పెంచడం వంటి చర్యలపై బడ్జెట్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జీఎస్టీ, వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబుల హేతుబద్ధీకరణ ద్వారా పన్ను వసూళ్లు పెరిగేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. ఫలితంగా వినియోగం పెరిగేందుకు దోహదం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సోమవారం జరిగిన ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో సూచించాయి.
దేశ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల ప్రభావం మరికొంతకాలం కొనసాగుతుందని ‘భారత పరిశ్రమల సమాఖ్య (CII)’ అధ్యక్షుడు సంజీవ్ బజాజ్ అన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ అంశాలను బలోపేతం చేసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ కల్పనను పెంచడం, ఫలితంగా వినియోగం పుంజుకొని వృద్ధి ఊపందుకుంటుందని వివరించారు. ఉద్యోగ సృష్టి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉద్యోగ ఆధారిత రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టాలని సీఐఐ సూచించింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని తెలిపింది. ఈ బడ్జెట్లోనే దానికి సంబంధించిన ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రతిపాదించాలని కోరింది.
మరోవైపు ప్రస్తుత కార్పొరేట్ పన్నులను అలాగే కొనసాగిస్తూ వ్యాపారాలకు దన్నుగా నిలవాలని బజాజ్ సూచించారు. మరోవైపు పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పన్ను వివాద పరిష్కారాలను సైతం తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు పీహెచ్డీసీసీఐ సైతం తమ ప్రతిపాదనల్ని కేంద్ర మంత్రి ముందు ఉంచింది. వినియోగాన్ని ప్రోత్సహించడం, ఫ్యాక్టరీల సామర్థ్యాల్ని పెంచడం, ఉద్యోగ సృష్టి, మౌలిక వసతుల నాణ్యతను పెంపొందించడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం ద్వారా ప్రైవేటు పెట్టుబడుల్ని తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పీహెచ్డీసీసీఐ సూచించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి ప్రతికూల పరిణామాలు కొనసాగుతున్న తరుణంలో బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి నెలకొందని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో దేశీయంగా వృద్ధికి ఊతమిచ్చే రంగాలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని హితవు పలికింది.
25న ఆర్థిక మంత్రులతో సమావేశం
ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ నెల 25న శుక్రవారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. దిల్లీలో జరగనున్న ఈ సమావేశంలో ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టబోయే బడ్జెట్పై చర్చించనున్నారు. ఈ నెల 22న వ్యవసాయం, వ్యవసాయ శుద్ధిరంగం, ఆర్థిక రంగం, స్టాక్ మార్కెట్లు; 24న సేవలు, వాణిజ్యం, సామాజిక రంగాలైన ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్య రంగాల వారితో; 28న కార్మిక సంఘాలు, ఆర్థిక నిపుణులతో సమావేశం కానున్నారు. ఉదయం, సాయంత్రం ఈ భేటీలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వైడ్ బాడీ విమానాలకు ఆర్డర్ పెట్టింది. తద్వారా ఎయిరిండియాకు గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. -
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
టెలికాం మార్కెట్లో తిరిగి పుంజుకుంటామని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పారు. వీఐ 2.0 ప్రస్థానం ప్రారంభం కాబోతోందన్నారు. -
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
Tech Mahindra: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా మార్చితో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. లాభంలో భారీ క్షీణతను నమోదు చేసుకుంది. -
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
Credit card: క్రెడిట్ కార్డు ద్వారా జరుపుతున్న లావాదేవీలు 2024 మార్చిలో సరికొత్త మైలురాయిని చేరాయి. -
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM