అప్పు.. పెనుభారమవుతోంది
ఎలాంటి హామీ అవసరం లేకుండా బ్యాంకులు అందించే వ్యక్తిగత రుణాలు ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉంటాయి. మిగతా రుణాలతో పోలిస్తే దీనికి వడ్డీ కాస్త ఎక్కువే.
వ్యక్తిగత రుణాలపై 20% మించిన వడ్డీ
దరఖాస్తుల తిరస్కరణా అధికంగానే
ఈనాడు, హైదరాబాద్: ఎలాంటి హామీ అవసరం లేకుండా బ్యాంకులు అందించే వ్యక్తిగత రుణాలు ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉంటాయి. మిగతా రుణాలతో పోలిస్తే దీనికి వడ్డీ కాస్త ఎక్కువే. కొవిడ్ పరిణామాల తర్వాత ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండటం, అన్ని రంగాలూ కోలుకోవడంతో రుణాలకు గిరాకీ పెరిగింది. అదే సమయంలో ప్రజల నగదు అవసరాలూ అధికమవుతున్నాయి. అందువల్లే ఎక్కువ వడ్డీ అయినా, వ్యక్తిగత రుణాల కోసం బ్యాంకులకు వెళ్తున్నారు. ఈ రుణ దరఖాస్తులను బ్యాంకులూ అంత వేగంగా ఆమోదించడం లేదు. క్రెడిట్రేటింగ్ బాగున్నవారికే ప్రాధాన్యమిస్తున్నాయి.
బంగారం హామీగా..
కొవిడ్ పరిణామాల్లో దెబ్బతిన్న చిరు వ్యాపారులు కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు అవసరమైన నగదు కోసం బంగారు ఆభరణాలను తనఖా పెట్టి, రుణాలు తీసుకున్నారు. 2021-22 చివరి త్రైమాసికంలో బ్యాంకుల రుణాల్లో అత్యధికం బంగారం తాకట్టు రుణాలే. తక్కువ వడ్డీ, సులువుగా అప్పు లభించడమే ఇందుకు కారణం. క్రెడిట్ స్కోరు, ఆదాయ ధ్రువీకరణలతో సంబంధం లేకపోవడమూ కలిసొచ్చింది. ఇప్పుడు ఈ రుణాలపైనా వడ్డీ రేట్లు పెరుగుతున్నందున, భారం అధికమవుతోంది.
నిధుల లభ్యత తగ్గడంతో..
రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికీ లక్ష్యమైన 6% కంటే అధికంగానే ఉన్నందున, దీన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ రెపో రేటును పెంచుతూ పోతోంది. ప్రస్తుతం ఇది 5.90 శాతానికి చేరింది. రుణాలకు గిరాకీ 17 శాతానికి పైగా పెరగ్గా, ఆ స్థాయిలో డిపాజిట్లు రాకపోవడంతో బ్యాంకుల్లో నగదు లభ్యత తక్కువగా ఉంటోంది. ఇటీవల వరకు తక్కువ వడ్డీ ఉండటంతో చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లకు బదులు అధిక ప్రతిఫలం వస్తుందనే భావనతో షేర్లు, డెట్ ఫండ్లలో మదుపు చేయడం ప్రారంభించారు. దీంతో బ్యాంకులు నిధుల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఇవి 8 శాతానికి మించడంతో, రుణ రేట్లూ ఇంకా పెరిగే అవకాశాలుండటం చిరు రుణగ్రహీతలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది.
పెద్ద రుణాలపైనే
వడ్డీ రేట్లు పెరుగుతున్నందున బ్యాంకులు వాణిజ్య, గృహరుణాలు లాంటి పెద్ద రుణాలు ఇచ్చేందుకే ఆసక్తి చూపుతున్నాయి. పలు బ్యాంకులు తాము అందిస్తున్న వ్యక్తిగత రుణ రేట్లను అమాంతం పెంచేశాయి. కొన్ని బ్యాంకులు 16-21% వడ్డీకి ఈ రుణాలను ఇస్తున్నాయి. కొన్ని ఎన్బీఎఫ్సీల్లో 31% వరకు వడ్డీ ఉండగా.. వార్షిక వడ్డీ 49% అని చెబుతున్నవీ ఉన్నాయి.
తిరస్కరణే ఎక్కువ..
క్రెడిట్ స్కోరు 750కి పైగా ఉన్న వారికి రుణాలు ఇటీవల వరకు సులువుగానే లభించేవి. ఇప్పుడు క్రెడిట్ స్కోరు బాగున్నా రూ.5లక్షల లోపు రుణాలివ్వడానికి బ్యాంకులు ఇష్టపడటం లేదు. ఫిన్టెక్ సంస్థలు నిధుల కొరత ఎదుర్కొంటుండటంతో ఇవి ఇచ్చే రుణ వితరణ మొత్తం తగ్గింది. ద్రవ్యలభ్యత మెరుగు పడితేనే ఈ సమస్యలకు పరిష్కారం లభించే వీలుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వైడ్ బాడీ విమానాలకు ఆర్డర్ పెట్టింది. తద్వారా ఎయిరిండియాకు గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. -
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
టెలికాం మార్కెట్లో తిరిగి పుంజుకుంటామని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పారు. వీఐ 2.0 ప్రస్థానం ప్రారంభం కాబోతోందన్నారు. -
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
Tech Mahindra: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా మార్చితో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. లాభంలో భారీ క్షీణతను నమోదు చేసుకుంది. -
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
Credit card: క్రెడిట్ కార్డు ద్వారా జరుపుతున్న లావాదేవీలు 2024 మార్చిలో సరికొత్త మైలురాయిని చేరాయి. -
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా