BYJUS: సీఎంతో బైజూస్ బాస్ భేటీ.. ఉద్యోగాల కోతపై వెనక్కి
ఖర్చు తగ్గింపులో భాగంగా ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. దాదాపు 2,500 మందికి ఆ కంపెనీ ఉద్వాసన పలికింది. దీనిపై ఆ సంస్థ విమర్శలు ఎదుర్కొంటోంది.
తిరువనంతపురం: ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ బైజూన్(Byju's) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళలో విధుల నుంచి తొలగించిన 140 మంది ఉద్యోగులను వెనక్కి తీసుకోవడంతో పాటు తిరువనంతపురంలో కార్యకలాపాలను పునరుద్ధరించనుంది. ఉద్యోగుల తొలగింపు విషయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్ భేటీ అయిన తర్వాత బైజూస్ ఈ ప్రకటన విడుదల చేసింది.
‘‘సీఎం పినరయి విజయన్తో బైజూస్ సీఈఓ రవీంద్రన్ సుదీర్ఘంగా జరిపిన చర్చల అనంతరం తిరువనంతపురంలోని మా కార్యకలాపాలను కొనసాగించాలని నిర్ణయించాం. దీని ఫలితంగా ఈ కేంద్రం నుంచి తొలగించిన 140 మంది ఉద్యోగులు తిరిగి విధుల్లో కొనసాగుతారు. కేరళకు చెందిన రవీంద్రన్.. సొంత రాష్ట్ర అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు’’ అని బైజూన్ ఈ ప్రకటనలో వెల్లడించింది.
బైజూస్ ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. హేతుబద్ధీకరణలో భాగంగా 5శాతం ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని చెప్పిన రవీంద్రన్.. ఆ ఉద్యోగులకు క్షమాపణలు కూడా తెలిపారు. ఖర్చు తగ్గింపుల నిమిత్తం తీసుకున్న ఈ నిర్ణయంలో భాగంగా తిరువనంతపురంలోని బైజూస్ టెక్నోపార్క్ను మూసివేసింది. దీంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు కేరళ రాష్ట్ర కార్మిక మంత్రిని ఆశ్రయించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా కంపెనీ తమ కార్యాలయాన్ని మూసివేసి, తమను విధుల నుంచి తొలగించిందని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు అభ్యర్థించారు. దీంతో కార్మిక మంత్రి ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. నేడు రవీంద్రన్, సీఎంతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఉద్యోగుల కోత అంశంపై కంపెనీ వెనక్కి తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)