- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
5G auction: 5జీ దిశగా కీలక ముందడుగు.. స్పెక్ట్రమ్ వేలానికి కేబినెట్ ఓకే
దిల్లీ: దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మరో కీలక ముందడుగు పడింది. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జులై చివరి నాటికి 72,097.85 మెగా హెడ్జ్ల స్పెక్ట్రమ్ను వేలం వేయనున్నట్లు బుధవారం అధికారిక ప్రకటన విడుదలైంది. ‘‘5జీ సేవలు అందించే స్పెక్ట్రమ్ వేలం కోసం టెలికమ్యూనికేషన్ విభాగం చేసిన ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం 72,097.85 మెగా హెడ్జ్ల రేడియో వేవ్లను 20 ఏళ్ల కాల వ్యవధితో వేలం వేయనున్నారు. ఇందులో తక్కువ (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మధ్య స్థాయి (3300 MHz), అత్యధిక (26 GHz) ఫ్రీక్వెన్సీ బాండ్లకు స్పెక్ట్రమ్ను వేలం వేయనున్నారు. టెలికాం రంగంలో సంస్కరణలతో ఈ వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు గానూ.. స్పెక్ట్రమ్ వేలంలో కేబినెట్ పలు ఆప్షన్లను తీసుకొచ్చింది.
టెలికాం వేలంలో తొలిసారిగా ముందస్తు చెల్లింపుల నిబంధనను ఎత్తేసింది. అంటే.. ‘‘వేలంలో విజేతగా నిలిచిన బిడ్డర్లు.. ముందస్తుగా ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ధరను 20 సమాన వాయిదాల్లో కట్టాలి. అయితే ప్రతి వాయిదాను సంవత్సరం ఆరంభంలోనే చెల్లించాలి’’ అని అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఇక, బిడ్డరు 10 ఏళ్ల తర్వాత స్పెక్ట్రమ్ను తిరిగి ఇచ్చే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అప్పుడు బ్యాలెన్స్ ఇన్స్టాల్మెంట్లను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వేలం ధర ఎంతన్నది మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేదు.
5జీ స్పెక్ట్రమ్పై ప్రభుత్వం ప్రతిపాదించిన ధరలు అధికంగా ఉన్నాయంటూ టెలికాం సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అందుబాటు ధరల్లోనే స్పెక్ట్రమ్ను తీసుకొచ్చేందుకు టెలికాం విభాగం కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే ఇప్పుడు 4జీలో వస్తున్న డౌన్లోడ్ స్పీడ్ కంటే 10 రెట్ల వేగంతో ఇంటర్నెట్ సేవలను పొందే వీలుంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pak on Kashmir: పాకిస్థాన్ ప్రధాని నోట.. శాంతి మాట
-
Movies News
Social look: సినీ తారలు.. అందాల ‘టాప్’లేపారు!
-
General News
Telangana News: అంబర్పేటలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఇంటర్బోర్డు కీలక ఆదేశాలు
-
India News
Anand Mahindra: ఆ ‘కారు’ గేట్.. మహీంద్రా మదిలో డౌట్.. ఏంటా కథ?
-
World News
China: మనుషులకే కాదు.. చేపలు, పీతలకూ కరోనా పరీక్షలు.. వైరల్గా వీడియోలు
-
Movies News
Trisha: రాజకీయాల్లోకి సినీ నటి త్రిష?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్షిప్పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Vijay Deverakonda: తెలుగు ప్రెస్మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్గా పంపించాలనే ఐడియా ఎవరిది..?