Life Insurance: క్లెయిమ్ కాని పాలసీల నిజమైన హక్కుదారులను తెలుసుకోవచ్చు
జీవిత బీమా సంస్థలు ఎంతో కాలంగా ఎదుర్కుంటున్న కాంటాక్ట్ ట్రేసింగ్ సమస్యకు క్యామ్స్రెప్ పరిష్కారాన్ని లాంచ్ చేసింది.
జీవిత బీమాలో క్లెయిమ్ చేయని పాలసీలకు సంబంధించిన వివరాలను ట్రేస్ చేసే సరికొత్త టెక్నాలజీని క్యామ్స్ రెప్ (క్యామ్స్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్) లాంచ్ చేసింది. ‘పాలసీ జీని డీప్ కాంటాక్ట్ ట్రేసింగ్’ తో పాలసీదారులు లేదా వారి నామినీ కాంటాక్ట్ వివరాలను తెలుసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) వద్ద ఎవరూ క్లెయిం చేయని రూ.21,539 కోట్ల నిధులు ఉన్నాయని, వడ్డీతో కలిపి తమ వద్ద ఇన్ని నిధులు పోగయ్యాయని సెబీకి సమర్పించిన ప్రాథమిక పత్రాల్లో ఎల్ఐసీ వెల్లడించింది. జీవిత బీమా పరిశ్రమలో క్లెయిమ్ చేయని నిధులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం రూ. 25 వేల కోట్లకు పైగా క్లెయిమ్ చేయని మొత్తం జీవిత బీమా సంస్థల వద్ద ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయి.
కొందరు పాలసీ తీసుకుంటారు, ప్రీమియంలు చివరి దాకా సమయానికి చెల్లిస్తారు. కానీ పాలసీ గురించి కుటుంబ సభ్యులకు తెలియజేయరు. దీంతో పాలసీదారుడు మరణిస్తే, పాలసీ ఉన్న విషయం కుటుంబ సభ్యులకు తెలియదు కాబట్టి వారు క్లెయిమ్ చేయలేరు. మరికొందరు వివిధ కారణాలతో పాలసీ తీసుకుంటారు. అయితే, నిధుల కొరత, చెల్లింపు తేదీలను మర్చిపోవడం వంటి పలు కారణాలతో సంబంధింత ప్రీమియంలను సమయానికి చెల్లించరు. దీంతో పాలసీ రద్దు అవుతుంది. ఒక్కోసారి పాలసీ తీసుకున్న విషయాన్నే మర్చిపోతుంటారు. దీంతో చాలా వరకు సొమ్ము పెనాల్టీల రూపంలో పోతుందని పాలసీ వదిలేస్తుంటారు. ఇలా వివిధ కారణాలతో పాలసీదారులకు క్లెయిమ్ మొత్తం చేరడం లేదు. ఈ మొత్తం బీమా సంస్థల దగ్గరే పేరుకుపోతుంది.
మరోవైపు బీమా సంస్థలు కూడా క్లెయిమ్ మొత్తాన్ని పాలసీదారులకు చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ, వారి జాడ తెలుసుకోవడం సులభం కాదు. ఈ సమస్యకు ‘పాలసీ జీని డీప్ కాంటాక్ట్ ట్రేసింగ్’ తక్కువ ఖర్చుతో..సమర్థవంతమైన పరిష్కారాన్ని చూపిస్తుందని సంస్థ తెలిపింది.
అధునాతన డిజిటల్ సెర్చింగ్ టెక్నాలజీని ఉపయోగించి నిజమైన పాలసీదారులను గుర్తించవచ్చని సంస్థ వెల్లడించింది. 5 నుంచి 20 సంవత్సరాల క్రితం జారీ చేసిన పాలసీలకు సంబంధించిన పాలసీదారులను గుర్తించడంలో ఇప్పటికే 11-25 శాతం విజయవంతమైనట్లు సంస్థ తెలిపింది. ఈ టెక్నాలజితో తక్కువ సమయంలోనే పాలసీదారులు లేదా వారి నామినీల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేయవచ్చంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్