Updated ITR: ఏదైనా ఆదాయం మర్చిపోయారా.. ఐటీఆర్ను అప్డేట్ చేయొచ్చు!
ఈ ఏడాది నుంచి ఐటీఆర్ను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కొత్తగా ఏదైనా ఆదాయం చేర్చాలనుకుంటే.. దానికి చెల్లించే పన్నుతో పాటు వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది....
Updated ITR: ఆదాయ పన్ను రిటర్ను పత్రాల్లో పలు మార్పులు చేసిన ఆదాయపు పన్ను విభాగం ఈసారి కొత్తగా ఐటీఆర్-యూ (ITR-U) ఫారాన్ని ప్రవేశపెట్టింది. అంటే కొత్త వివరాలతో అప్డేట్ చేసిన రిటర్నులను మరోసారి సమర్పించేందుకు అవకాశం కల్పించింది. దీన్నే అప్డేటెడ్ ఐటీఆర్ (Updated ITR)గా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు మార్పులు చేస్తూ ‘కేంద్ర బడ్జెట్ 2022’లో ప్రకటన చేశారు.
ఏంటీ అప్డేటెడ్ రిటర్నులు?
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 (8ఏ) ప్రకారం అప్డేటెడ్ ఐటీఆర్ (Updated ITR)ను సమర్పించే అవకాశం కల్పించారు. అదనపు పన్నులు చెల్లించినప్పుడు, ఏవైనా తప్పులు దొర్లినా, పొరపాటున ఏదైనా ఆదాయాన్ని పేర్కొనడం మర్చిపోయినా.. ఈ ఐటీఆర్-యూ ఫారంతో అప్డేటెడ్ రిటర్నులను దాఖలు చేయొచ్చు.
ఎవరు దాఖలు చేయొచ్చు..
ఇప్పటికే ఐటీఆర్ దాఖలు చేసినవారు, ఆలస్యపు ఐటీఆర్ సమర్పించిన వారితో సహా రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేసినవారు అవసరమైతే అప్డేటెడ్ రిటర్నులను సమర్పించేందుకు అవకాశం ఉంది. కొత్త వివరాలతో కూడిన ఐటీఆర్-యూను దాఖలు చేయొచ్చు. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పాటు తర్వాతి సమీక్షా ఏడాదికి అప్డేటెడ్ ఐటీఆర్ సమర్పించొచ్చు. అయితే, ఒక సమీక్షా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఐటీఆర్ను అప్టేడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఎంత గడువు?
2022 ఏప్రిల్ 1 నుంచి ఐటీఆర్-యూ సమర్పించేందుకు గడువు ప్రారంభమైంది. సమీక్షా సంవత్సరం ముగిసిన దగ్గరి నుంచి 24 నెలల్లోపు ఐటీఆర్ను అప్డేట్ చేయొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 2020-21, 2021-22 సమీక్షా సంవత్సరాలకు అప్డేటెడ్ ఐటీఆర్ను ఫైల్ చేసుకోవచ్చు.
ఒకవేళ అప్డేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేస్తే అదనపు ఆదాయంపై చెల్లించాల్సిన పన్నుకు వడ్డీ వర్తిస్తుంది. 12 నెలల్లోగా ఐటీఆర్-యూ దాఖలు చేస్తే 25 శాతం, 24 నెలల్లోపు సమర్పిస్తే 50 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2019-20 సమీక్షా సంవత్సరానికి ఇప్పుడెవరైనా ఐటీఆర్ను అప్డేట్ చేయాలనుకుంటే.. కొత్త ఆదాయంపై పన్నుతో పాటు దానిపై 50 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఎలాంటి వివరాలు పొందుపర్చాలి?
ఎయే మార్గాల ద్వారా కొత్త ఆదాయాన్ని ఆర్జించారో దాన్ని మాత్రమే ఐటీఆర్-యూలో పొందుపరిస్తే సరిపోతుంది. సాధారణ ఐటీఆర్లో పేర్కొన్నట్లుగా ప్రతి ఆదాయమార్గ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. పాన్, ఆధార్, చిరునామా వంటి వివరాలతో పాటు ఐటీఆర్ను అప్డేట్ చేయడానికి గల కారణాన్ని నిర్ధిష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.
ఎవరు చేయొద్దు?
ఒక సమీక్షా సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ దాఖలు చేసిన వ్యక్తిపై ఐటీ విభాగం తనిఖీ లేదా సర్వే లేదా విచారణ ప్రక్రియ ప్రారంభిస్తే.. వారు అప్డేటెడ్ ఐటీఆర్ దాఖలు చేయడానికి అనుమతి ఉండదు. అలాగే కొత్తగా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా.. ఐటీఆర్ అప్డేట్ చేయనక్కర్లేదు. ఒకవేళ గత రిటర్నులతో పోలిస్తే పన్ను తగ్గుతుందనుకున్నా.. ఆదాయంలో నష్టం వాటిల్లినా, రీఫండ్ పెరిగే అవకాశం ఉందని భావించినా.. ఐటీఆర్-యూ సమర్పించడానికి అవకాశం ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
Tech Mahindra: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా మార్చితో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. లాభంలో భారీ క్షీణతను నమోదు చేసుకుంది. -
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
Credit card: క్రెడిట్ కార్డు ద్వారా జరుపుతున్న లావాదేవీలు 2024 మార్చిలో సరికొత్త మైలురాయిని చేరాయి. -
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ