సియట్‌ టైర్ల కోసం బాబా అవతారంలో రానా

ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ సియట్‌ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ నటుడు రానాను నియమించుకుంది. కొత్తగా తీసుకొచ్చిన ‘పంక్చర్‌ సేఫ్‌’ బైక్‌ టైర్ల ప్రచారానికి

Updated : 13 Feb 2021 18:39 IST

ముంబయి: ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ సియట్‌ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ నటుడు రానాను నియమించుకుంది. కొత్తగా తీసుకొచ్చిన ‘పంక్చర్‌ సేఫ్‌’ బైక్‌ టైర్ల ప్రచారానికి ఈ మేరకు రానాతో ఒప్పందం చేసుకుంది. ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో టీవీ, డిజిటల్‌ యాడ్స్‌లో రానా కనిపించనున్నారు. ఇందులో రానా బాబా అవతారంలో బైక్‌ నడుపుతూ కనిపించారు. 

ప్రస్తుతం జరుగుతున్న భారత్‌- ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ నుంచే ఈ యాడ్‌ ప్రసారం కానుందని సియట్‌ టైర్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అర్ణబ్‌ బెనర్జీ తెలిపారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ టైర్లు ఒకవేళ పంక్చర్‌ అయినా గాలి పోదని బెనర్జీ తెలిపారు. 2.5మిల్లీ మీటర్లు కలిగిన వ్యాసం వరకు ఏర్పడిన పంక్చర్లను ఈ కొత్త టెక్నాలజీ కలిగిన టైర్లు పూడ్చివేస్తాయని తెలిపారు. సియట్‌ టైర్స్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని రానా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇవీ చదవండి..
పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్నారా..అయితే,
ఐదో రోజూ ఆగని పెట్రో ధరల పరుగు!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని