Agriculture: రైతులకు ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వ పథకాలివే..
కేంద్రం దేశవ్యాప్తంగా రైతు ప్రయోజనాలను ఆశించి వ్యవసాయ రంగానికి అనేక పథకాలను ప్రవేశపెట్టింది, వీటిలో ముఖ్యమైన పథకాలు ఇక్కడ ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం రైతులకు, వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాల్లో ప్రధానమైనవి కిసాన్ క్రెడిట్ కార్డు (KCC), ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY), ప్రధాన మంత్రి కిసాన్ మాన్-ధన్ యోజన (PMKMY), ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN), ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) వంటివి ఇందులో ఉన్నాయి. మరి ఈ పథకాలు రైతులకు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
1. కిసాన్ క్రెడిట్ కార్డు (KCC)
2020లో కేంద్ర ప్రభుత్వం సవరించిన కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రారంభించింది. ఇది రైతులకు వారి సాగు, ఇతర అవసరాల కోసం ఒకే విండోలో బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తగినంత రుణాన్ని సకాలంలో అందిస్తుంది. భూ యజమానులైన రైతులకు, కౌలు రైతులుగా పేర్కొనే వారికి విడిగా, ఉమ్మడిగా కూడా రుణాలను అందిస్తుంది.
ఏ అవసరాలకు రుణం?
ఈ రుణాలను పంటల సాగుకే కాకుండా పంట తర్వాత ఖర్చులు, పంటను మార్కెటింగ్ చేసుకోవడానికి, రైతు గృహ వినియోగ అవసరాలు తీర్చుకోవడానికి కూడా అందిస్తుంది. పాడి పశువులు, చేపల పెంపకం, వ్యవసాయ పంపు సెట్లు, స్ప్రేయర్లు మొదలైన వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు కూడా రుణాలను ఇస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్బీలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార సంస్థలు రైతులకు రుణాలు ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
2. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)
ఇది వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం. 2016లో కేంద్రం దీన్ని ప్రారంభించింది. ఇది నివారించలేని ప్రకృతి నష్టాల నుంచి పంటలను కాపాడ్డానికి ఏర్పాటైంది. విత్తడానికి ముందు, పంట తర్వాత కలిగే నష్టాలకు సమగ్ర పంట బీమా కవరేజీని రైతులకు అందిస్తుంది. ఊహించని సంఘటనల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు ఆర్థిక సహాయం అందించి, వినూత్నమైన, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహిస్తుంది. రైతులు స్వల్ప మొత్తంలో పంటల ప్రీమియంను చెల్లించవలసి ఉంటుంది. ఈ ఫసల్ బీమా యోజన స్కీమ్కు దేశవ్యాప్తంగా 36 కోట్లకు పైగా రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 2022 ఫిబ్రవరి 4 నాటికి ఈ పథకం కింద ఇప్పటికే విలువ పరంగా రైతులకు రూ.1,07,059 కోట్లకు పైగా క్లెయిమ్ సెటిల్మెంట్ జరిగింది.
3. ప్రధాన మంత్రి కిసాన్ మాన్-ధన్ యోజన(PMKMY)
ఈ పథకాన్ని 2019లో ప్రారంభించారు. ఇది చిన్న, సన్నకారు రైతుల కోసం స్వచ్ఛంద, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం. దేశంలోని రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. 2019 ఆగస్టు నాటికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల భూ రికార్డులలో పేర్లు ఉన్న 18-40 సంవత్సరాల వయసు గల, రెండు హెక్టార్ల వరకు సాగు భూమిని కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతులందరూ ఈ పథకం ప్రకారం ప్రయోజనాలను పొందడానికి అర్హులు. రైతులు వారి వయసును బట్టి నెలకు రూ.55-200 వరకు పెన్షన్ ఫండ్కు జమ చేయాలి. వారు 60 సంవత్సరాల వయసులో పెన్షన్ అర్హత పొందేందుకు కనీసం 20 ఏళ్ల పాటు చందాను అందించాలి. రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలవారీ రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. 2022 జనవరి, 31 నాటికి మొత్తం 21,86,918 మంది రైతులు ఈ పథకంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
4. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన(PMKSY)
'హర్ ఖేత్ కో పానీ' నినాదంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. సాగు విస్తీర్ణాన్ని నిర్ధారిత నీటిపారుదలతో విస్తరించడానికి, నీటి వృథాను తగ్గించడానికి, నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ పథకం అమలు చేస్తున్నారు. 2021-22 సంవత్సరానికి 10 లక్షల హెక్టార్లకు పైగా భూమి మైక్రో ఇరిగేషన్ కింద సాగు చేస్తున్నారు.
5. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN)
2018లో ప్రారంభమైన ఈ పథకంలో చిన్న, సన్నకారు భూమి కలిగిన రైతు కుటుంబాలకు సాగు సహాయం, వారి ఆర్థిక అవసరాల కోసం రూపొందించారు. ఈ పథకం కింద భూమిని కలిగి ఉన్న రైతులకు కేంద్రం ప్రతి 4 నెలలకు (3 సమాన వాయిదాల్లో) రూ.2000, అంటే సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం మొదట్లో 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతుల కోసం ఏర్పాటైంది. 2019 జూన్ 1 నుంచి ఈ స్కీమ్ పరిధిని భూమి ఉన్న రైతులందరికీ అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా 2022, ఆగస్టు వరకు దాదాపు 11.37 కోట్ల మంది అర్హులైన రైతులకు రూ.2 లక్షల కోట్లకు పైగా నగదు బదిలీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి. -
రెగ్యులర్ Vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్?
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో మదుపర్లకు రెండు రకాల పథకాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. -
వివిధ లార్జ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఇలా ఉన్నాయి
3, 5, 10 సంవత్సరాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇక్కడ ఉన్నాయి. -
స్థిరాస్తుల్లో మదుపు చేద్దామా
పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలాంటి పెట్టుబడి పథకాలు, బంగారం, స్థిరాస్తుల వరకూ ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి. -
ఓటీపీ ఆ అంకెలు జాగ్రత్త
ఒక్క క్లిక్తో కావాల్సినవన్నీ కొనేస్తున్నాం. బ్యాంకింగ్ లావాదేవీలన్నీ చేసేస్తున్నాం. వీటన్నింటికీ ఆరంకెల ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) చాలు.. ఇంత సౌలభ్యంతోపాటు, కొన్ని ప్రమాదాలూ పొంచి ఉన్నాయి
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే