Chandigarh: పెట్రోల్ బైక్ల రిజిస్ట్రేషన్లు బంద్..!
విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే దిశగా చండీగఢ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ ద్విచక్రవాహనాల రిజిస్ట్రేషన్లను 35 శాతం తగ్గించింది. ఈ లక్ష్యం నెరవేరడంతో ఫిబ్రవరి 10 నుంచి వాటి రిజిస్ట్రేషన్లను నిలిపేసింది.
చండీగఢ్: పర్యావరణ అనుకూల రవాణావ్యవస్థ దిశగా విద్యుత్ వాహనాల(Electric Vehicles)ను ప్రోత్సహించేందుకు చండీగఢ్(Chandigarh) పాలనాయంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్(Vehicle Registration)లను తాత్కాలికంగా నిలిపేసింది. ఫిబ్రవరి 10 నుంచి ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గతేడాది సెప్టెంబరులో ప్రవేశపెట్టిన ‘విద్యుత్ వాహనాల విధానం(EV Policy)’లో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకుంది.
విద్యుత్ వాహనాలు కానివాటిని పరిమితం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ క్రమంలోనే నాన్ ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లను పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. నాలుగు చక్రాల వాహనాల్లో 10 శాతం, ద్విచక్ర వాహనాల్లో 35 శాతం రిజిస్ట్రేషన్లను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలే ఇది పూర్తికావడంతో.. ఫిబ్రవరి 10 నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపేసింది.
ఫిబ్రవరి 10, ఆపై కొనుగోలు చేసిన ఇంధన ఆధారిత ద్విచక్ర వాహనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేవరకు(మార్చి 31) చండీగఢ్లో రిజిస్ట్రేషన్ చేయబోమని పాలనాయంత్రాంగం తేల్చిచెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రక్రియ పునఃప్రారంభం అవుతుందని వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2023-24)లో రిజిస్ట్రేషన్లను 65 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించారు. ఆపై వాహనాలను వేరే ఇతర చోట రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఇలా 2024 నాటికి ఇంధన ఆధారిత ద్విచక్ర వాహనాలు, ఆటోల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేయనున్నారు. 2024 నుంచి మూడేళ్లలో ఇంధన ఆధారిత వ్యక్తిగత కార్ల రిజిస్ట్రేషన్లను కూడా 30, 40, 50 శాతానికి తగ్గించాలని అధికార యంత్రాంగం యోచిస్తున్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.