ChatGPT: చాట్జీపీటీ గొప్పదే.. కానీ, ఉద్యోగుల్ని భర్తీ చేయలేదు: నారాయణ మూర్తి
ఉత్పాదకతను పెంచేందుకు చాట్జీపీటీ (ChatGPT) వంటివి మనుషులకు కేవలం సాధనాలుగా మాత్రమే ఉపయోగపడతాయని ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayan Murthy) అభిప్రాయపడ్డారు.
ముంబయి: చాట్జీపీటీ (ChatGPT) వంటి ఏఐ (AI) ఆధారిత చాట్బాట్లు మనుషులను భర్తీ చేయలేవని ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayan Murthy) అన్నారు. తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సమాచార సేకరణకు, విషయ సముపార్జనకు చాట్జీపీటీ గొప్ప సాధనం. కానీ, కొన్ని విషయాల్లో అది మనుషులతో పోటీ పడలేదు. మనిషి మెదడును మించిన యంత్రం మరోటి లేదని నమ్మే వారిలో నేను ఒకణ్ని. కాబట్టి, చాట్జీపీటీ వంటి ఏఐ చాట్బాట్లు ఎప్పటికీ మనుషులను భర్తీ చేయలేవు’’ అని ఆయన స్పష్టం చేశారు.
ఏఐ చాట్బాట్లు ఉద్యోగులను భర్తీ చేస్తాయన్న ఆందోళనల నేపథ్యంలో నారాయణ మూర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించకున్నాయి. ఉత్పాదకతను పెంచేందుకు చాట్జీపీటీ వంటివి మనుషులకు కేవలం సాధనాలుగా మాత్రమే ఉపయోగపడతాయని ఆయన అభిప్రాపడ్డారు. ఇద్దరు వ్యక్తులు చాట్జీపీటీని ఒకే విధమైన ప్రశ్న అడిగితే.. వారివురికి ఒకే సమాధానం వస్తుంది. కానీ, ఆ సమాధానానికి ఇద్దరిలో ఒకరు అదనంగా తమ సృజనాత్మకతను జోడించి మెరుగైన ఫలితం పొందినట్లు చూపించవ్చని నారాయణ మూర్తి వెల్లడించారు. చాట్జీపీటీ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవరంలేదని చెప్పారు. మనిషి సృజనాత్మకత, అత్యాధునిక సాంకేతికత కలిస్తే ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు.
గతంలో కూడా ఒక సదస్సులో పాల్గొన్న నారాయణ మూర్తి, చాట్జీపీటీపై ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏఐ కారణంగా ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోతారనే వాదనలు వెలువడిన నేపథ్యంలో మూర్తి వాటితో విభేదించారు. కొద్దిరోజుల క్రితం ఏఐ, చాట్జీపీటీలతో భవిష్యత్లో మానవాళి మనుగడకే ప్రమాదం తలెత్తవచ్చనే ఆందోళనతో వాటి అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని ఎలాన్ మస్క్ (Elon Musk) సహా పలువురు నిపుణులు ‘పాజ్ జియాంట్ ఏఐ ఎక్స్పెరిమెంట్స్’ పేరిట ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM