ChatGPT: సీఈఓకు రూ.90 లక్షల మొండిబాకీ.. వసూలు చేసిన చాట్జీపీటీ
కృత్రిమ మేథతో పనిచేస్తోన్న చాట్జీపీటీ (ChatGPT) అద్భుతం చేసింది. ఓ సీఈఓకు రావాల్సిన రూ.90లక్షల మొండిబాకీని వసూలు చేయడంలో సాయం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం చాట్జీపీటీ(ChatGPT). ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) తో పనిచేసే ఈ టూల్ గురించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ చాట్జీపీటీ సాయంతో ఓ సీఈఓ రూ.90లక్షల మొండిబాకీని వసూలు చేసుకోగలిగారు. చాట్జీపీటీ రాసిన మెయిల్కు భయపడి తనకు రావాల్సిన డబ్బును తిరిగిచ్చేశారని లేట్ చెక్అవుట్ అనే డిజైన్ స్టూడియో సీఈఓ గ్రెగ్ ఐసెన్బర్గ్ తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
గ్రెగ్ ఐసెన్బర్గ్ (Greg Isenberg)కు చెందిన డిజైన్ కంపెనీ.. ఓ ప్రధాన బ్రాండ్కు డిజైన్ పనులు చేసిపెట్టింది. వారి పనికి మెచ్చి ఆ మల్టీ బిలియన్ డాలర్ క్లయింట్ వీరికి మరిన్ని ఆర్డర్లు ఇచ్చారు. అయితే ఆ పనికి 1,09,500 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.90లక్షలు) చెల్లించాల్సి ఉండగా.. ఆ క్లయింట్ డబ్బులు ఇవ్వలేదు. దీంతో గ్రెగ్ ఐసెన్బర్గ్ చాట్జీపీటీ (ChatGPT) సాయం తీసుకున్నారు. ఈ టూల్ తనకు ఏ విధంగా సాయం చేసిందో వివరిస్తూ గ్రెగ్ వరుస ట్వీట్లు చేశారు.
‘‘డిజైన్, ఇంజినీరింగ్లో మా కంపెనీ వందలాది ప్రాజెక్టులు పూర్తిచేసింది. కానీ ఇలా డబ్బులు చెల్లించని క్లయింట్ను మేం చూడలేదు. ఈ పరిస్థితి మా బృందం నైతికతను దెబ్బతీసింది. దీంతో నేనే రంగంలోకి దిగాను. అయితే డబ్బులు అడుగుతూ మరో ఈమెయిల్ రాసినా ఎలాంటి ప్రయోజనం లేదనిపించింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపాలి. అందుకు 1000 డాలర్ల వరకు ఖర్చయ్యేది. కానీ అప్పుడే నాకో ఆలోచన వచ్చింది. చాట్జీపీటీ సాయం తీసుకున్నా. పరిస్థితి వివరించి.. ఆ క్లయింట్ను ‘భయపెడుతూ’ ఓ డ్రాఫ్ట్ రాసివ్వమని కోరారు. చాట్జీపీటీ (ChatGPT) ఇచ్చిన సమాధానంలో స్వల్ప మార్పులు చేసి ఆ డ్రాఫ్ట్ను క్లయింట్కు మెయిల్ చేశా. రెండు నిమిషాల్లో ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ నుంచి నాకు స్పందన వచ్చింది. థాంక్యూ చాట్జీపీటీ (ChatGPT). నీ వల్లే నేను నా మొండి బకాయిని వసూలు చేసుకోగలిగా’’ అని గ్రెగ్ ట్విటర్లో వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!