Chitra Ramkrishna: ‘యోగి’ని గుర్తుపట్టేందుకు నిరాకరించిన చిత్రా రామకృష్ణ
కో-లొకేషన్ కుంభకోణం కేసులో అరెస్టయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు నేడు ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు.
దిల్లీ: కో-లొకేషన్ కుంభకోణం కేసులో అరెస్టయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు సోమవారం ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం ఆమెను 14 రోజుల కస్డోడియల్ విచారణకు అనుమతించాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. విచారణకు చిత్ర సహకరించడం లేదని, ‘హిమాలయ యోగి’ని గుర్తుపట్టేందుకు ఆమె నిరాకరిస్తున్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది.
‘‘చిత్ర రామకృష్ణ, ఆమె మాజీ సలహాదారు ఆనంద్ సుబ్రమణియన్ నడుమ దాదాపు 2500 ఈ-మెయిళ్లు నడిచినట్లు గుర్తించాం. విచారణలో భాగంగా చిత్ర.. ఆనంద్ను ఎదుర్కొన్నారు. అయితే అతడిని గుర్తుపట్టేందుకు ఆమె నిరాకరించారు’’ అని సీబీఐ కోర్టుకు వెల్లడించింది. కో-లొకేషన్ కేసులో వరుసగా మూడు రోజుల పాటు చిత్రను విచారించిన సీబీఐ.. ఆదివారం ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో ఆమె సరిగ్గా సమాధానం ఇవ్వలేదని, అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని సీబీఐ తెలిపింది.
ఆనంద్ సుబ్రమణియనే అదృశ్య యోగి అని సీబీఐ వర్గాలు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. 2013-16 మధ్య చిత్రా రామకృష్ణన్ సమాచారం పంచుకున్న ఇమెయిల్ ఐడీని సుబ్రమణియన్ సృష్టించినట్లు ఆ వర్గాలు ధ్రువీకరించాయి. కొన్ని మెయిళ్లలో ఆనంద్కు చెందిన మరో మెయిల్ ఐడీ కూడా మార్క్ చేసి ఉందని.. వీటి స్క్రీన్ షాట్స్ను ఆనంద్ మెయిల్ ఐడీల నుంచి రికవరీ చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలోనే గతవారం చిత్రను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. హిమాలయ యోగి గురించి ఆరా తీశాయి. ఆనంద్ సుబ్రమణియన్ను ఆమె ఎదురుగా నిలబెట్టాయి. అయితే చిత్ర అతడిని గుర్తుపట్టేందుకు నిరాకరించారని సీబీఐ నేడు కోర్టుకు తెలిపింది. అందుకే ఆమెను 14 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరింది. అయితే కోర్టు 7 రోజుల కస్టోడియల్ విచారణకు అనుమతినిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM