రూ.3లక్షల కోట్లతో ఉద్దీపన అవసరం!
కరోనా వైరస్ మహమ్మారి దాటికి ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు రూ.3లక్షల కోట్లతో మరో ఉద్దీపన అవసరమని కన్ఫెడరేషన్
కేంద్ర ప్రభుత్వానికి సీఐఐ సూచన
దిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి దాటికి ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు రూ.3లక్షల కోట్లతో మరో ఉద్దీపన అవసరమని కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) పేర్కొంది. జన్ధన్ ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయడం, ఉపాధి హామీ పథకానికి మరిన్ని నిధులు పెంచే చర్యలు చేపట్టాలని సూచించింది. వీటితో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా మరింత ముమ్మరం చేయాల్సి ఉందని పరిశ్రమల సమాఖ్య స్పష్టం చేసింది.
ఆర్థిక వ్యవస్థను వేగంగా తిరిగి గాడిలో పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడమే కీలకమని సీఐఐ అధ్యక్షుడు టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. ఇందుకోసం దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని 2021 చివరి నాటికి 175కోట్ల డోసులకు పెంచాలని సూచించారు. దేశవ్యాప్తంగా పెద్దవారందరికీ వ్యాక్సిన్ అందివ్వాలంటే జూన్ నుంచి నిత్యం సరాసరి 70లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ లక్ష్యాన్ని చేరేందుకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ మంత్రిత్వశాఖ (ప్రత్యేక విభాగాన్ని) ఏర్పాటు చేయాలని సీఐఐ అధ్యక్షుడు సూచించారు.
మార్కెట్లో డిమాండ్ సృష్టించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టాలని సీఐఐ సూచించింది. ముఖ్యంగా జన్ధన్ ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేయాలని అభిప్రాయపడింది. ఉపాధి హామీ పథకానికి మరిన్ని నిధులు పెంచాలని సూచించింది. వీటితో పాటు జీఎస్టీ తగ్గింపుపై ఆలోచించాలని తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు కొంతకాలం మినహాయింపులు ఇవ్వడంతోపాటు సొంతింటి కొనుగోలుదారులకు రాయితీలు ఇవ్వాలని సూచించింది. ఇలాంటి విపత్కర సమయంలో పన్నులను పెంచాలనుకోవడం మంచి ఆలోచన కాదని సీఐఐ అభిప్రాయపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్