బీమా ఇంకా క్లెయిమ్ చేసుకోలేదా? ఇప్పుడు చేసుకోండి !
బీమా క్లెయిం విధానాలను, అందుకు సిద్ధంగా ఉంచుకోవాల్సిన వివరాలపై అవగాహన పెంచుకోవడం అవసరం
మెచ్యూరిటీ పూర్తయానా, ప్రీమియం రీఫండ్లు, పాలసీదారుడు మరణానంతరం చేసుకునే క్లెయిమ్ వంటి వాటికి సంబంధించి జీవిత బీమా రంగంలో ఇప్పటివరకు రూ. 15,166.47 కోట్ల క్లెయిమ్ చేసుకొని నిధులు మిగిలిపోయాయన్న సంగతి మీకు తెలుసా అవగాహన లేక చాలా మంది బీమా పాలసీ ఉన్నప్పటికీ క్లెయిమ్ చేసుకోవడం లేదు. అందుకే బీమా నియంత్రణ సంస్థ కూడా పాలసీదారులకు సులభంగా క్లెయిమ్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
జీవిత బీమా ముఖ్య ఉద్దేశం పాలసీదారు కుటుంబానికి రక్షణ కల్పించడం. పాలసీదారుకు అనుకోకుండా ఏదైనా జరిగితే తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు కుటుంబం సంసిద్ధంగా ఉండాలి. అందుకు ఆర్థిక చేయూత ఉండాలి. జీవిత బీమా తీసుకున్నవారి తరఫున కుటుంబానికి అండగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు క్లెయిం చేసే విధానం పై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం. క్లెయిం విధానం ముందే తెలుసుకోవడం వల్ల అవసరమైన సందర్భంలో సరైన నిర్ణయాలు తీసుకొని పరిహారం సులువుగా పొందేందుకు వీలవుతుంది.
క్లెయిమ్ చేసుకునే విధానం
మీరు పాలసీ తీసుకున్న సంస్థ వెబ్సైట్ ద్వారా ఇప్పటివరకు క్లెయిమ్ చేసుకోని మొత్తాన్ని తెలుసుకోవచ్చు. కొన్ని సంస్థల వెబ్సైట్ హోమ్ పేజీలోనే ఈ ఆప్షన్ ఉంటుంది. మరికొన్నింటికి కస్టమర్ సర్వీసెస్ కింద ఈ ఆప్షన్ ఉంటుంది. మీరు క్లెయిమ్ చేసుకొని మొత్తాన్ని తెలుసుకునేందుకు మీ పేరు, పుట్టిన తేదీ, పాలసీ నంబర్, పాన్, ఆధార్ వంటి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేసుకునే ముందు , ఎంత క్లెయిమ్ చేసుకునేందుకు వీలుందో తెలుసుకొని నేరుగా బీమా సంస్థను సంప్రదించడం మంచిది. తర్వాత సంస్థలు కేవైసీ పూర్తి చేసిన తర్వాత క్లెయిమ్ ప్రాసెస్ను ప్రారంభిస్తాయి. తర్వాత మీ ఖాతాకు డబ్బును చేరవేస్తాయి.
క్లెయిమ్ చేసుకోవడం చాలా ముఖ్యం
ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును బీమా పాలసీ కొనుగోలు చేసేందుకు వెచ్చిస్తారు. మరి అవసరమైన సమయంలో క్లెయిమ్ చేసుకోకపోతే మీ డబ్బు వృథా అవుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, బీమా సంస్థల వద్ద ఉన్న క్లెయిమ్ చేసుకోని డబ్బును సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ (ఎస్సీడబ్ల్యూఎఫ్)కి బదిలీ చేస్తారు. బదిలీ చేసిన 25 సంవత్సరాల లోపు వారికి చెందాల్సిన డబ్బును క్లెయిమ్ చేసుకునే అవకాశం పాలసీదారులకు, నామినీలకు ఉంటుంది. 25 సంవత్సరాల తర్వాత కూడా క్లెయిమ్ చేసుకోకపోతే మీ డబ్బు ప్రభుత్వ అదీనంలోకి వెళ్తుంది. అప్పుడు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!