Coal India: వేసవిలో కరెంటు కష్టాలు తప్పవా?
ధరలు పెంచని పక్షంలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ కోల్ ఇండియా హెచ్చరించింది.....
బొగ్గు ఉత్పత్తిపై కోల్ ఇండియా కీలక హెచ్చరిక
దిల్లీ: ధరలు పెంచని పక్షంలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ కోల్ ఇండియా హెచ్చరించింది. దీంతో విద్యుత్తు సహా ఇతర ఇంధన ఆధారిత సేవల్లో అంతరాయం తప్పకపోవచ్చునని తెలిపింది.
ప్రపంచంలోనే అతిపెద్ద మైనింగ్ సంస్థ అయిన కోల్ ఇండియాపై వ్యయభారం ఎక్కువవుతోంది. ఉద్యోగులు, సిబ్బంది వేతనాల పెంపు, మైనింగ్లో ఉపయోగించే డీజిల్ ధరల పెరుగుదల వంటి అంశాలు ధరల పెంపునకు దారితీస్తున్నాయి. సంస్థలోని కొన్ని యూనిట్లకు నడపడం తలకు మించిన భారంగా మారిందని కంపెనీ ఛైర్మన్ ప్రమోద్ అగర్వాల్ వెల్లడించారు.
దీర్ఘకాల సరఫరా ఒప్పందాల్లో బొగ్గు ధరను పెంచడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఒకవేళ అలా చేస్తే దేశ ద్రవ్యోల్బణం సహా ఇతర ఆర్థిక అంశాలపై ప్రభావం పడుతుంది. థర్మల్ విద్యుదుత్పత్తికి కావాల్సిన బొగ్గులో 70 శాతం కోల్ ఇండియానే ప్రభుత్వానికి అందిస్తోంది. గత ఏడాది ఉత్పత్తి భారీగా పడిపోవడంతో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఉత్పత్తిని భారీగా పెంచాలని కోల్ ఇండియాను సర్కార్ ఆదేశించింది. ఇది సంస్థపై వ్యయభారాన్ని మరింత పెంచింది.
మరోవైపు విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు గత సెప్టెంబరులో కనిష్ఠానికి చేరుకున్నాయి. అయితే, ఇప్పటికీ నిల్వలు ఏప్రిల్ 2020 నాటి గరిష్ఠాలతో పోలిస్తే మూడోవంతు మాత్రమే ఉన్నాయి. వేసవి సమీపిస్తుండడంతో విద్యుత్తుకు గిరాకీ పెరగనుంది. ఈ తరుణంలో కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తిని తగ్గిస్తామని ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే