Futures and Options: 90% నష్టపోతామని తెలిసినా.. వాటిలో పెట్టుబడిపై ఆసక్తి ఎందుకో?: సెబీ చీఫ్
Futures and Options: మదుపర్లు దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టినప్పుడే మెరుగైన లాభాలు వస్తాయని సెబీ చీఫ్మాధబి పురి బచ్ తెలిపారు.
ముంబయి: ‘ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O)’లో మదుపర్ల ఆసక్తి తనకు ఆశ్చర్యంతో పాటు గందరగోళానికి గురిచేస్తోందని సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్ (Madhabi Puri Buch) అన్నారు. స్టాక్ మార్కెట్లోని ఈ విభాగంలో 90 శాతం మంది డబ్బు కోల్పోతున్నారని వెల్లడించారు. దీర్ఘకాలిక సాధనాల్లోనే మదుపర్లు పెట్టుబడి పెట్టాలని సూచించారు. బీఎస్ఈలో ‘ఇన్వెస్టర్ రిస్క్ రెడక్షన్ యాక్సెస్ (IRRA)’ ప్లాట్ఫామ్ను ప్రారంభిస్తూ సోమవారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
మదుపర్లు దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టినప్పుడే మెరుగైన లాభాలు వస్తాయని మాధబి పురి బచ్ తెలిపారు. పైగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించిన రాబడి పొందడానికి ఇదే మేలైన మార్గమని సూచించారు. మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ తాజా అధ్యయనాన్ని ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎఫ్అండ్ఓ (F&O)లో ఇన్వెస్ట్ చేసిన 45.24 లక్షల వ్యక్తిగత ట్రేడర్లలో కేవలం 11 శాతం మంది మాత్రమే లాభాలు పొందగలిగారని సెబీ ఇటీవల వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం తర్వాత ఈ సెగ్మెంట్లో మదుపు చేస్తున్న వారి సంఖ్య 500 శాతం పెరిగిందని పేర్కొంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్అండ్ఓ (F&O)లో ఇన్వెస్ట్ చేసిన వారిలో 89 శాతం మంది నష్టపోయారని సెబీ నివేదిక తెలిపింది. వీరు దాదాపు రూ.1.1 లక్షల కోట్ల సంపదను కోల్పోయారని వెల్లడించింది. లాభాలు పొందిన వారిలో సగటున ఒక్కొక్కరు రూ.1.5 లక్షలు ఆర్జించినట్లు తెలిపింది. 2018- 19 నాటికి ఎఫ్అండ్ఓ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారిలో 11 శాతం మంది 20- 30 ఏళ్ల వయసువారేనని పేర్కొంది.
బ్రోకింగ్ వ్యవస్థలో ఏదైనా లోపం తలెత్తినప్పుడు ఇన్వెస్టర్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తీసుకొచ్చిందే ఈ ఐఆర్ఆర్ఏ. సమస్య తలెత్తిన వెంటనే మదుపర్లకు ఎసెమ్మెస్ ద్వారా ఓ లింక్ వస్తుందని అధికారులు తెలిపారు. దాంతో ఐఆర్ఆర్ఏను డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ పొజిషన్లను రెండు గంటల్లో స్క్వేర్ఆఫ్ చేయొచ్చని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్ఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 4 లక్షల కోట్ల డాలర్లకు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ తొలిసారిగా (ఈ నెల 1న) 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.334.72 లక్షల కోట్ల) మైలురాయిని అధిగమించింది. -
విమానాల పార్కింగుకు అధిక ఛార్జీలు!
సాంకేతిక, ఇతర సమస్యల కారణంగా విమానాలను నిలిపివేస్తున్న (గ్రౌండింగ్) సందర్భాలు పెరుగుతున్నాయి. కార్యకలాపాలు సాగించని ఇలాంటి విమానాలను నిలిపి ఉంచడం వల్ల, దిల్లీ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలం తగ్గిపోతోంది. -
పొరుగు దేశాల నుంచి రూ.లక్ష కోట్ల ఎఫ్డీఐ ప్రతిపాదనలు
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు సంబంధించి.. మనదేశంతో సరిహద్దును పంచుకుంటున్న దేశాల నుంచే, 2020 ఏప్రిల్ తర్వాత రూ.లక్ష కోట్ల విలువైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వీటిలో సగం దరఖాస్తులను ఇప్పటికే ఆమోదించినట్లు తెలిపారు. -
హోండా కార్ల ధరలూ పెరుగుతాయ్
జనవరి నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు హోండా కార్స్ ఇండియా తెలిపింది. పెరిగిన తయారీ వ్యయాల భారాన్ని కంపెనీపై తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఉపాధ్యక్షుడు (మార్కెటింగ్, విక్రయాలు) కునాల్ బెల్ వివరించారు. -
వెండి రాణింపు!
పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో కదలాడితే రూ.63,930 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.64,505; రూ.66,629 వరకు రాణించొచ్చు. -
ఎఫ్ఐఐల కొనుగోళ్లతో ముందుకే
ఈ వారమూ మార్కెట్లలో జోష్ కొనసాగేందుకే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది పెద్దగా పనితీరు కనబరచని బ్యాంకింగ్, ఆర్థిక సేవల షేర్ల వైపు అందరి దృష్టీ ఉంది. దేశీయ వృద్ధిపై బలమైన అంచనాలకు తోడు అంతర్జాతీయంగా అధిక వడ్డీ రేట్లు, చమురు ధరల్లో ఊగిసలాటలు కొలిక్కి వస్తుండటంతో మార్కెట్లో సెంటిమెంటు సానుకూలంగా మారింది. -
67,928ను మించితే సానుకూలం!