Twitter: మస్క్ అల్టిమేటంతో ట్విటర్లో గందరగోళం!
Twitter: ట్విటర్ను నిజమైన వాక్ స్వేచ్ఛకు వేదికగా మారుస్తానంటూ చెప్పిన మస్క్.. ఇప్పుడు సంస్థలో తీవ్ర గందరగోళానికి కారణమయ్యారు. ఆయన తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలతో ఉద్యోగులు విసుగెత్తినట్లు తెలుస్తోంది. ఉంటారా.. వెళ్తారా.. అంటూ ఆయన జారీ చేసిన అల్టిమేటం మొదటికే మోసం తెచ్చినట్లుంది.
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి సంస్థలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు మార్పులు తప్పవని ప్రకటించిన మస్క్.. అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో మొదటికే మోసమొచ్చే పరిస్థితులు తలెత్తుతున్నాయి. అసలు ఆయన ఏం చేయనున్నారు? ట్విటర్ను ఎలా తీర్చిదిద్దనున్నారనే సంశయంతో ఉద్యోగులు స్వచ్ఛందంగా సంస్థను వీడేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆయన బుధవారం జారీ చేసిన ఓ అల్టిమేటం ఈ గందరగోళ పరిస్థితుల్ని మరింత తీవ్రం చేసింది.
కొంపముంచిన అల్టిమేటం..
కంపెనీని మెరుగుపరిచేందుకు కష్టపడి పనిచేస్తారా.. లేక వెళ్లిపోతారా అంటూ బుధవారం ఉద్యోగులకు మస్క్ ఓ మెయిల్ పంపిన విషయం తెలిసిందే. ఇలా లిఖితపూర్వకంగా హామీ కోరడాన్ని అనేక మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనికి సమ్మతిస్తే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనన్న భయంతో చాలా మంది కంపెనీని వీడడానికే మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా సంస్థ కార్యకలాపాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. మస్క్ ఇచ్చిన మూడు నెలల గడువు తర్వాత వెళ్లడానికి చాలా మంది సుముఖంగా ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులు తెలిపారు. కంపెనీ అంతర్గత సమాచార వేదికల్లో ఉద్యోగులంతా ‘సెల్యూట్ ఎమోజీ’లను పోస్ట్ చేస్తున్నట్లు సమాచారం.
ఇలా అయితే కష్టమేనట!
కంపెనీని వీడుతున్న వారిలో కీలక వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ట్విటర్ పనితీరు ఎలా ఉంటుందనే కీలక సమాచారం తెలిసిన వ్యక్తులు, బృందాలు సైతం కంపెనీని వీడడానికి సిద్ధమైనట్లు సమాచారం. మస్క్ తీసుకొస్తున్న మార్పుల వల్ల వచ్చే సమస్యల్ని పరిష్కరించడం బహుశా సాధ్యం కాకపోవచ్చుననే అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారట. పైగా మస్క్ ట్విటర్ను సొంతం చేసుకున్నప్పటి నుంచి అమెరికా ప్రభుత్వం సైతం దీనిపై దృష్టి సారించినట్లు సమాచారం. విద్వేష సమాచారం పెరిగిపోయి దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోందని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తే దాంట్లో ట్విటర్ బయటపడే అవకాశం లేదని ఉద్యోగులు భావిస్తున్నారట!
అప్రమత్తమైన యాజమాన్యం..
ఉద్యోగుల మూకుమ్మడి నిర్ణయంతో అప్రమత్తమైన ట్విటర్.. సోమవారం వరకు కార్యాలయాలను మూసివేసినట్లు బ్లూమ్బెర్గ్ పేర్కొంది. ఈ మేరకు యాజమాన్యం ఉద్యోగులకు లేఖ రాసినట్లు సమాచారం. కంపెనీ నిబంధనల ప్రకారం.. ఎవరూ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయొద్దని ఉద్యోగులను కోరినట్లు తెలుస్తోంది. నిజానికి బుధవారం నాటి అల్టిమేటం వల్ల ఈ స్థాయిలో ఉద్యోగులు కంపెనీని వీడతారని మస్క్ అంచనా వేయలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్బెర్గ్ పేర్కొంది.
మస్క్ దిద్దుబాటు చర్యలు..
మొదటికే మోసం వస్తోందని గమనించిన మస్క్ వెంటనే అప్రమత్తమైనట్లు సమాచారం. అల్టిమేటం జారీ చేస్తూ పంపిన ఫారం సమర్పించడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా.. మస్క్ ఉద్యోగులకు ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అందులో ఉద్యోగుల్ని బుజ్జగించేందుకు ఆయన ప్రయత్నించారట! కొన్ని నిబంధనల విషయంలో వెనక్కి తగ్గారని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ‘ఇంటి నుంచి పని’ విషయంలో.. పనితీరు బాగుందని మేనేజర్లు ధ్రువీకరించిన వారికి మినహాయింపు ఇచ్చే యోచనలో ఉన్నామని మస్క్ ఉద్యోగులకు వివరించే ప్రయత్నం చేశారట. అలాగే కంపెనీలోని కొంతమంది కీలక వ్యక్తులతో సమావేశం కూడా నిర్వహించినట్లు సమాచారం. అయినప్పటికీ ఉద్యోగులు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 655 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203