పాలసీ రెన్యువల్స్పై డిస్కౌంట్ పరిశీలించండి.. బీమా కంపెనీలకు IRDAI సూచన
మూడు కొవిడ్ డోసులు తీసుకున్న వారికి పాలసీ రెన్యువల్స్పై డిస్కౌంట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని బీమా కంపెనీలకు ఐఆర్డీఏఐ సూచించింది.
దిల్లీ: చైనా సహా పలు దేశాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీమా కంపెనీలకు బీమా నియంత్ర సంస్థ (IRDAI) కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. మూడు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సాధారణ, ఆరోగ్య బీమా పాలసీ రెన్యువల్స్పై డిస్కౌంట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అలాగే జీవిత బీమా, జీవిత బీమాయేతర క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించాలని, కాగిత వినియోగాన్ని తగ్గించాలని సూచించినట్లు తెలిసింది. కొవిడ్-19పై గత వారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఈ మేరకు కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది.
తమ వెల్నెస్ నెట్వర్క్ పరిధిలో RT-PCR పరీక్షలు చేయించుకునే పాలసీ హోల్డర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా చూడాలని ఐఆర్డీఏఐ సూచించింది. సోషల్ మీడియా ఖాతాల ద్వారా కొవిడ్ సంబంధిత జాగ్రత్తలపై అవగాహన కల్పించాలంది. అంతర్జాతీయ ప్రయాణ బీమాకు సంబంధించి వేర్వేరు దేశాలు వేర్వేరు పద్ధతులు అనుసరిస్తున్నందున అవసరమైన కొవిడ్ పరీక్షల వివరాలను ముద్రించాలని సూచించింది.
దేశంలో కొవిడ్ మొదటి, రెండో వేవ్ల సమయంలో క్యాష్లెస్ పాలసీ ఉన్నప్పటికీ చాలా ఎంప్యానెల్డ్ ఆస్పత్రులు డిపాజిట్లు స్వీకరించాయని ఐఆర్డీఏఐ గుర్తుచేసింది. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఆయా ఆస్పత్రులను నిలువరించాలని బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ సూచించినట్లు తెలిసింది. కొవిడ్ తీవ్ర రూపం దాల్చితే కొవిడ్ సంబంధిత సాయం కోసం వార్ రూమ్ ఏర్పాటు చేయాలని బీమా సంస్థలకు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మార్చి వరకు మొత్తం 2.25 లక్షల డెత్ క్లెయిమ్లను బీమా సంస్థలు సెటల్ చేసినట్లు గత వారంవిడుదల చేసిన తన వార్షిక నివేదికలో ఐఆర్డీఏఐ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.