కొవిషీల్డ్: కేంద్రానికి రూ.200..ప్రైవేటులో..?
తాము ఉత్పత్తి చేస్తోన్న కరోనావైరస్ టీకా ‘కొవిషీల్డ్’ను ప్రభుత్వానికి ఒక్కో డోసు రూ.200 చొప్పున విక్రయిస్తామని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు
వెల్లడించిన సీరం సంస్థ సీఈఓ
దిల్లీ: తాము ఉత్పత్తి చేస్తోన్న కరోనావైరస్ టీకా ‘కొవిషీల్డ్’ను ప్రభుత్వానికి ఒక్కో డోసు రూ.200 చొప్పున విక్రయిస్తామని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. ప్రభుత్వం అనుమతించిన తర్వాత ప్రైవేటు మార్కెట్లో విక్రయించే సమయంలో దాని విలువ రూ.1000గా ఉంటుందని తెలిపారు. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కరోనావైరస్ టీకాను భారత్లో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆదివారం కేంద్రం నుంచి భారత్లో అత్యవసర వినియోగానికి అనుమతులు కూడా పొందింది.
టీకా వినియోగానికి అనుమతులు పొందిన నేపథ్యంలో అదర్ మీడియాతో మాట్లాడారు. మొదటి 100 మిలియన్ల డోసులను భారత ప్రభుత్వానికి ప్రత్యేక ధరకు విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. రూ.200లకు ఒక డోసు చొప్పున అందిస్తున్నామన్నారు. అదే ప్రైవేటు మార్కెట్లో ఆ ధర రూ.1,000 ఉంటుందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం తుది దశకు చేరుకున్న వారం, పది రోజుల్లో టీకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రైవేటు మార్కెట్లలో విక్రయం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం మేం భారత ప్రభుత్వానికి మాత్రమే టీకాలు అందించగలమని చెప్పారు.
అలాగే 300 నుంచి 400 మిలియన్ల డోసుల టీకాలను అందించే ఉద్దేశంతో తాము ఐరాస ‘కొవాక్స్’ ప్రాజెక్టు ఒప్పందంపై సంతకం చేసే దశలో ఉన్నామని అదర్ తెలిపారు. 2021 డిసెంబర్ నాటికి దానికి 200 నుంచి 300 మిలియన్ల డోసులు అందించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. టీకా పంపిణీ విషయంలో భారత్ దేశానికి.. కొవాక్స్ ప్రాజెక్టు మధ్య సమతుల్యతను పాటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కొవిడ్-19 టీకాలు అందరికి లభించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవాక్స్ అనే ప్రాజెక్టును ప్రారంభించింది.
ఇవీ చదవండి:
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్